చేసిన సినిమాలతో కంటే సింగర్ నోయల్తో పెళ్లి, విడాకులతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఎస్తేర్ నొరోహా. ఈమధ్య యూ ట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా లైమ్ లైట్లోకి వచ్చింది. వీటిలో తన కెరీర్ కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువ విషయాలు చెప్పింది. ఇప్పుడిక తన దృష్టి మొత్తం కెరీర్ పైనే అంటోంది.
సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్లో ‘69 సంస్కార్ కాలనీ’ అనే సినిమాలో నటించింది ఎస్తేర్. మార్చ్ 18న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో కాసేపు కబుర్లాడింది. ఇందులో వైశాలి అనే హౌస్ వైఫ్ పాత్రలో కనిపిస్తుందట ఎస్తేర్. ఇలాంటి పాత్రలో నటించినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ సంబర పడుతూ చెబుతోంది.
సునీల్ కుమార్ రెడ్డి సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అందుకు ఏమాత్రం తీసిపోదని ట్రైలర్ చూస్తే అర్థమయ్యింది. చాలా బోల్డ్గా ఉందనే నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలైంది. కానీ ఎస్తేర్ మాత్రం సినిమాని, తన పాత్రని వెనకేసుకొస్తోంది. అసలు ఈ సినిమా కథలో తనకి నచ్చిందే బోల్డ్నెస్ అని, దాని కోసమే ఒప్పుకున్నానని చెప్పింది. చాలామంది జీవితాల్లో బోల్డ్నెస్ ఉంటుందని, ఎవరూ పైకి చెప్పరని, సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడానికే తీసిన ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉందని అంటోంది.
నిజానికి కెరీర్ ప్రారంభంలో వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాల్లో మంచి పాత్రలే చేసింది ఎస్తేర్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్కి ఒప్పుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆమె నటించిన మరో సినిమా కూడా త్వరలో రిలీజవుతుందట. ఇంకో సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా చేతిలో ఉందట. మరి వాటిలో ఎలాంటి పాత్రలు చేయనుందో.
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…