చేసిన సినిమాలతో కంటే సింగర్ నోయల్తో పెళ్లి, విడాకులతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఎస్తేర్ నొరోహా. ఈమధ్య యూ ట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా లైమ్ లైట్లోకి వచ్చింది. వీటిలో తన కెరీర్ కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువ విషయాలు చెప్పింది. ఇప్పుడిక తన దృష్టి మొత్తం కెరీర్ పైనే అంటోంది.
సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్లో ‘69 సంస్కార్ కాలనీ’ అనే సినిమాలో నటించింది ఎస్తేర్. మార్చ్ 18న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో కాసేపు కబుర్లాడింది. ఇందులో వైశాలి అనే హౌస్ వైఫ్ పాత్రలో కనిపిస్తుందట ఎస్తేర్. ఇలాంటి పాత్రలో నటించినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ సంబర పడుతూ చెబుతోంది.
సునీల్ కుమార్ రెడ్డి సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అందుకు ఏమాత్రం తీసిపోదని ట్రైలర్ చూస్తే అర్థమయ్యింది. చాలా బోల్డ్గా ఉందనే నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలైంది. కానీ ఎస్తేర్ మాత్రం సినిమాని, తన పాత్రని వెనకేసుకొస్తోంది. అసలు ఈ సినిమా కథలో తనకి నచ్చిందే బోల్డ్నెస్ అని, దాని కోసమే ఒప్పుకున్నానని చెప్పింది. చాలామంది జీవితాల్లో బోల్డ్నెస్ ఉంటుందని, ఎవరూ పైకి చెప్పరని, సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడానికే తీసిన ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉందని అంటోంది.
నిజానికి కెరీర్ ప్రారంభంలో వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాల్లో మంచి పాత్రలే చేసింది ఎస్తేర్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్కి ఒప్పుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆమె నటించిన మరో సినిమా కూడా త్వరలో రిలీజవుతుందట. ఇంకో సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా చేతిలో ఉందట. మరి వాటిలో ఎలాంటి పాత్రలు చేయనుందో.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…