ఐదేళ్లు కావస్తోంది మలయాళ హీరోయిన్ భావన మీద లైంగిక దాడి జరిగి. ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. మాలీవుడ్లో స్టార్ హీరో అయిన దిలీప్ ఈ దాడి వెనుక సూత్రధారి అని ఆరోపణలు రావడం, అతను ఈ కేసులో కొన్ని నెలల పాటు జైల్లో ఉండటం.. తర్వాత బెయిల్ మీద బయటికి రావడం తెలిసిందే.
ఏవో వ్యక్తిగత విషయాల్లో గొడవ కారణంగా మనుషుల్ని పెట్టి భావనను కిడ్నాప్ చేయించి ఆమెపై లైంగిక దాడి చేయించడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీని గురించి మొన్నటిదాకా భావన ఎక్కడా నోరు విప్పలేదు. మీడియా కూడా ఈ కేసు విషయంలో ఆమె పేరు రాసేది కాదు.
కానీ తాను తప్పు చేయనపుడు మౌనం వహించడమేంటన్న ఉద్దేశంతో ఇటీవల భావన ఈ వ్యవహారంపై ఓపెన్ అయింది. ఈ కేసు పురోగతి గురించి కేరళ ముఖ్యమంత్రి విజయన్కు బహిరంగ లేఖ కూడా రాసింది.
తాజాగా ఆమె ఈ కేసు విషయమై ఒక నేషనల్ టీవీ ఛానెల్తో మాట్లాడింది. తన పై జరిగిన లైంగిక దాడి కారణంగా తానెంత మానసిక క్షోభ ఎదుర్కొన్నది ఈ లైవ్ కార్యక్రమంలో ఆమె చెప్పుకొచ్చింది. ఆ దాడి ఘటనే తనను తీవ్ర మనోవేదనకు గురి చేస్తే.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత వేదన మిగిల్చాయని ఆమె వెల్లడించింది.
ఈ వ్యవహారంలో తన కోసం చాలామంది నిలబడ్డారని.. అదే సమయంలో బాధితురాలైన తన మీదే ఓ వర్గం నిందలు వేసి, తనను సూటి పోటి మాటలతో వేధించిందని.. ఆ రోజు తాను ఎందుకు ఆ సమయంలో బయటికి వెళ్లానంటూ ప్రశ్నలు వేశారని.. ఇందులో తనదే తప్పని మాట్లాడారని.. ఇవి తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బాధ పెట్టాయని భావన వివరించింది.
2019 వరకు తాను సోషల్ మీడియాలో లేనని.. ఆ ఏడాది ఇన్స్టాగ్రామ్లోకి రాగా.. అక్కడ చాలామంది తన మీద దాడికి దిగారని.. ఇంకా ఎందుకు బతికున్నావ్, చచ్చిపోవచ్చు కదా అంటూ కామెంట్లు చేశారని భావన తెలిపింది. ఇంకా ఇలా మౌనం వహించడం సరి కాదన్న ఉద్దేశంతోనే ఇటీవల తాను ఈ విషయమై ఓపెన్ అయ్యానని, సీఎంకు లేఖ రాశానని.. ఈ సందర్భంగా తనకు గొప్ప మద్దతు లభించిందని భావన తెలిపింది.
This post was last modified on March 6, 2022 8:48 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…