డీజే టిల్లు.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ చిన్న సినిమానే అని చెప్పాలి. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. రిలీజ్ ముంగిట అనూహ్యమైన బజ్ తెచ్చుకుంది. ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన యువత.. డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ చేసే హడావుడి చూడటానికి థియేటర్లకు పరుగులు పెట్టేశారు.
‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలవడం విశేషం. సినిమా స్థాయిని మించి బయ్యర్లు కాస్త ఎక్కువ పెట్టుబడే పెట్టినా.. వాళ్లందరికీ భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. చేసిన బిజినెస్కు రెట్టింపు స్థాయిలో దీనికి షేర్ రావడం విశేషం. ఓవరాల్ షేర్ రూ.10 కోట్ల మార్కును దాటిపోవడం గమనార్హం. ‘భీమ్లా నాయక్’ వచ్చే వరకు ఈ సినిమానే బాక్సాఫీస్ను లీడ్ చేసింది. థియేట్రికల్ రన్ ముగిశాక ‘డీజే టిల్లు’ ఓటీటీ బాట పట్టి అక్కడా సంచలనం రేపుతోంది.
‘డీజే టిల్లు’ ఆహాలో ఈ శుక్రవారమే రిలీజైంది. డిజిటల్ రిలీజ్ ముంగిట ఆహా వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. థియేటర్లలో సినిమా చూడని వాళ్లు, అలాగే చూసిన వాళ్లు కూడా ‘ఆహా’లో ఈ సినిమా కోసం ఎగబడుతున్నట్లే కనిపిస్తోంది. కేవలం 48 గంటల వ్యవధిలో ఈ చిత్రం 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఓ చిన్న సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఇంత స్ట్రీమింగ్ సమయం పూర్తి కావడం అంటే మాటలు కాదు. ఈ వీకెండ్లో ఇండియా మొత్తంలో అత్యధిక మంది వీక్షించిన… టాప్లో ట్రెండ్ అవుతున్న ఓటీటీ సినిమాల జాబితాలోనూ ‘డీజే టిల్లు’ టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం. ఓటీటీ అప్డేట్స్ ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ ‘డీజే టిల్లు’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.
‘డీజే టిల్లు’ ఓవరాల్గా అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఇందులో డీజే టిల్లు పాత్రతో కనెక్ట్ అయితే చాలు పైసా వసూల్ అన్నట్లే. ఆ పాత్ర.. అందులో సిద్ధు నటన.. డైలాగ్స్.. ఇవి చాలు ఎంటర్టైన్ అయిపోవడానికి.
This post was last modified on March 6, 2022 3:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…