డీజే టిల్లు.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ చిన్న సినిమానే అని చెప్పాలి. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. రిలీజ్ ముంగిట అనూహ్యమైన బజ్ తెచ్చుకుంది. ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన యువత.. డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ చేసే హడావుడి చూడటానికి థియేటర్లకు పరుగులు పెట్టేశారు.
‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలవడం విశేషం. సినిమా స్థాయిని మించి బయ్యర్లు కాస్త ఎక్కువ పెట్టుబడే పెట్టినా.. వాళ్లందరికీ భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. చేసిన బిజినెస్కు రెట్టింపు స్థాయిలో దీనికి షేర్ రావడం విశేషం. ఓవరాల్ షేర్ రూ.10 కోట్ల మార్కును దాటిపోవడం గమనార్హం. ‘భీమ్లా నాయక్’ వచ్చే వరకు ఈ సినిమానే బాక్సాఫీస్ను లీడ్ చేసింది. థియేట్రికల్ రన్ ముగిశాక ‘డీజే టిల్లు’ ఓటీటీ బాట పట్టి అక్కడా సంచలనం రేపుతోంది.
‘డీజే టిల్లు’ ఆహాలో ఈ శుక్రవారమే రిలీజైంది. డిజిటల్ రిలీజ్ ముంగిట ఆహా వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. థియేటర్లలో సినిమా చూడని వాళ్లు, అలాగే చూసిన వాళ్లు కూడా ‘ఆహా’లో ఈ సినిమా కోసం ఎగబడుతున్నట్లే కనిపిస్తోంది. కేవలం 48 గంటల వ్యవధిలో ఈ చిత్రం 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఓ చిన్న సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఇంత స్ట్రీమింగ్ సమయం పూర్తి కావడం అంటే మాటలు కాదు. ఈ వీకెండ్లో ఇండియా మొత్తంలో అత్యధిక మంది వీక్షించిన… టాప్లో ట్రెండ్ అవుతున్న ఓటీటీ సినిమాల జాబితాలోనూ ‘డీజే టిల్లు’ టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం. ఓటీటీ అప్డేట్స్ ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ ‘డీజే టిల్లు’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.
‘డీజే టిల్లు’ ఓవరాల్గా అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఇందులో డీజే టిల్లు పాత్రతో కనెక్ట్ అయితే చాలు పైసా వసూల్ అన్నట్లే. ఆ పాత్ర.. అందులో సిద్ధు నటన.. డైలాగ్స్.. ఇవి చాలు ఎంటర్టైన్ అయిపోవడానికి.
This post was last modified on March 6, 2022 3:20 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…