యువ కథానాయకుడు శర్వానంద్ ఒకప్పుడు ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి వరుస హిట్లతో మంచి ఊపు మీదుండేవాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు వచ్చినా.. మహానుభావుడుతో కొంచెం పుంజుకున్నట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత మాత్రం అతడికి చెప్పుకోదగ్గ హిట్టే లేదు. టాక్తో సంబంధం లేకుండా అతడి సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. జాను, శ్రీకారం లాంటి మంచి సినిమాలు కూడా ఆడలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన మహాసముద్రం ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే.
దీంతో ప్రయోగాలు పక్కన పెట్టి ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పటికే మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో శర్వా ఈ చిత్రంతో కచ్చితంగా హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే అతడి కెరీర్కు చాలా ఇబ్బంది అవుతుంది. నేను శైలజ తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.
రష్మిక మందన్నా లాంటి లక్కీ ఛార్మ్ను హీరోయిన్గా పెట్టుకుని.. రాధిక, ఖుష్బూ సహా ప్రముఖ తారాగణం.. దేవిశ్రీ ప్రసాద్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో ఈ చిత్రానికి ప్యాడింగ్ బాగానే కుదిరింది. పాటలు, టీజర్, ట్రైలర్.. ఇలా అన్ని ప్రోమోలు కూడా పాజిటివ్ ఫీల్ తీసుకొచ్చాయి. డీజే టిల్లు, భీమ్లా నాయక్ చిత్రాలతో బాక్సాఫీస్ ఊపందుకున్న టైంలో ఈ సినిమా రిలీజవుతోంది. వేసవి ముంగిట ఈ చిత్రం మంచి ఫలితాన్నందుకుంటుందనే ఆశలు టాలీవుడ్లో కలుగుతున్నాయి.
మరి అనుకూల పరిస్థితుల్లో మంచి బజ్తో వస్తున్న ఈ చిత్రంతో అయినా శర్వా హిట్టు కొడతాడా.. లేక తన ఫ్లాపుల పరంపరలోకి ఇంకో సినిమాను జత చేస్తాడా అన్నది చూడాలి. దీంతో పాటుగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ అనే చిన్న సినిమా కూడా రిలీజవుతోంది. ఆ సినిమా కూడా పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతోంది. మరి ఈ రెండు చిత్రాలకు శుక్రవారం ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…