యువ కథానాయకుడు శర్వానంద్ ఒకప్పుడు ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి వరుస హిట్లతో మంచి ఊపు మీదుండేవాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు వచ్చినా.. మహానుభావుడుతో కొంచెం పుంజుకున్నట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత మాత్రం అతడికి చెప్పుకోదగ్గ హిట్టే లేదు. టాక్తో సంబంధం లేకుండా అతడి సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. జాను, శ్రీకారం లాంటి మంచి సినిమాలు కూడా ఆడలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన మహాసముద్రం ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే.
దీంతో ప్రయోగాలు పక్కన పెట్టి ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పటికే మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో శర్వా ఈ చిత్రంతో కచ్చితంగా హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే అతడి కెరీర్కు చాలా ఇబ్బంది అవుతుంది. నేను శైలజ తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.
రష్మిక మందన్నా లాంటి లక్కీ ఛార్మ్ను హీరోయిన్గా పెట్టుకుని.. రాధిక, ఖుష్బూ సహా ప్రముఖ తారాగణం.. దేవిశ్రీ ప్రసాద్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో ఈ చిత్రానికి ప్యాడింగ్ బాగానే కుదిరింది. పాటలు, టీజర్, ట్రైలర్.. ఇలా అన్ని ప్రోమోలు కూడా పాజిటివ్ ఫీల్ తీసుకొచ్చాయి. డీజే టిల్లు, భీమ్లా నాయక్ చిత్రాలతో బాక్సాఫీస్ ఊపందుకున్న టైంలో ఈ సినిమా రిలీజవుతోంది. వేసవి ముంగిట ఈ చిత్రం మంచి ఫలితాన్నందుకుంటుందనే ఆశలు టాలీవుడ్లో కలుగుతున్నాయి.
మరి అనుకూల పరిస్థితుల్లో మంచి బజ్తో వస్తున్న ఈ చిత్రంతో అయినా శర్వా హిట్టు కొడతాడా.. లేక తన ఫ్లాపుల పరంపరలోకి ఇంకో సినిమాను జత చేస్తాడా అన్నది చూడాలి. దీంతో పాటుగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ అనే చిన్న సినిమా కూడా రిలీజవుతోంది. ఆ సినిమా కూడా పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతోంది. మరి ఈ రెండు చిత్రాలకు శుక్రవారం ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
This post was last modified on March 4, 2022 7:49 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…