యుఎస్లో ఉండే తెలుగు ఎన్నారైల అభిరుచి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రేక్షకులతో పోలిస్తే కొంచెం భిన్నమే. వాళ్లకు మాస్ సినిమాలు అంతగా నచ్చవు. అలాగే రీమేక్ సినిమాల పట్ల కూడా అంతగా ఆసక్తి చూపించరు. క్లాస్ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే ఎక్కువగా పట్టం కడుతుంటారు. ఒక సినిమా చూడాలంటే వాళ్లు చాలా దూరం ప్రయాణించి, ఎక్కువ టికెట్ రేటు పెట్టాల్సి ఉంటుంది. అందుకే తమ అభిరుచికి భిన్నమైన సినిమాలు చూడటానికి అంతగా ఆసక్తి చూపించరు.
తాము చూడాలనుకున్న సినిమాలను ఆచితూచి ఎంచుకుంటుంటారు. కానీ కొందరు హీరోల విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ మారిపోతుంటాయి. వాళ్లు మాస్ సినిమాలు చేసినా.. రీమేక్ చిత్రాల్లో నటించినా.. ఏమీ పట్టించుకోకుండా థియేటర్లకు పరుగులు పెట్టేస్తుంటారు. అలాంటి హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు.గత ఏడాది యుఎస్ బాక్సాఫీస్ డల్లుగా ఉన్న టైంలో ‘వకీల్ సాబ్’ లాంటి లో బజ్ ఉన్న సినిమాతో సులువుగా మిలియన్ మార్కును టచ్ చేశాడు పవన్.
ఇప్పుడు ‘భీమ్లా నాయక్’తో మరింతగా వసూళ్ల మోత మోగిస్తున్నాడు. ఈ చిత్రం ప్రిమియర్లతోనే దాదాపు 9 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. తొలి వీకెండ్లో నిలకడగా వసూళ్లు సాధిస్తూ 2 మిలియన్ మార్కును దాటేసింది. సోమవారం వసూళ్లు డ్రాప్ అయినా.. మంగళవారం టికెట్ల ధరల్లో ఆఫర్లు కలిసి రావడంతో వసూళ్లు పుంజుకున్నాయి.
ఇప్పటికే ఆ చిత్రం అక్కడ 2.3 మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు రాబట్టి.. 2.5 మిలియన్ మార్కు దిశగా అడుగులు వేస్తోంది. ఈ వీకెండ్ అయ్యేసరికి ఆ మార్కును కూడా దాటేయడం ఖాయం. ‘భీమ్లా నాయక్’ మాస్ సినిమా, పైగా రీమేక్. దీని మాతృక ‘అయ్యప్పనుం కోషీయుం’ రెండేళ్ల నుంచి అమేజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. నిజానికి ఒరిజినలే యుఎస్ ఎన్నారైల అభిరుచికి దగ్గరగా ఉంటుంది. దాన్ని తెలుగులో మంచి మాస్ మసాలా సినిమాలా మార్చారు. అలాంటి సినిమాతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం పవన్కే చెల్లింది.
This post was last modified on March 3, 2022 6:52 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…