ఈ హెడ్డింగ్ చూస్తే మరీ అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ.. ఈ మాట అన్నది మామూలు వ్యక్తి అయితే కాదు. ఆస్కార్ అవార్డు గెలిచిన సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి. ముంబయిలో రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా రసూల్ ఈ వ్యాఖ్య చేశారు. సౌండ్ డిజైనింగ్ చేయడంలో భాగంగా ఈ సినిమా క్లైమాక్స్ చూసి తాను స్టన్ అయిపోయాయని.. అది టైటానిక్ సినిమా పతాక ఘట్టం కంటే మిన్నగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మాట తాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్తోనూ అన్నట్లు రసూల్ వెల్లడించారు. ఈ సినిమాలో ఇంకా చెప్పడానికి చాలా విశేషాలున్నాయని.. కానీ వాటిని ఇప్పుడే తాను వెల్లడించాలనుకోవట్లేదని చెబుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచాడు రసూల్. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ ఈ మాట అన్నాడంటే రాధేశ్యామ్ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గానే ఉంటుందని భావించవచ్చు.
రాధేశ్యామ్ పతాక ఘట్టాలు భారీ నౌక నేపథ్యంలో నడుస్తాయని ట్రైలర్ చూసినపుడే అర్థమైంది. ప్రభాస్ గత సినిమాల్లో మాదిరి యాక్షన్ లేకపోయినా.. ఇందులో భారీతనానికి లోటు లేదని, విజువల్ ఫీస్ట్ అనిపించే సన్నివేశాలు ఉంటాయని రెండు ట్రైలర్లు చూస్తే అర్థమైంది. సముద్రంలో ప్రళయం చోటు చేసుకుని భారీ నౌక తలకిందులవుతున్న దృశ్యాలు ట్రైలర్లలో కనిపించాయి.
ఈ సన్నివేశాలు ఇప్పటి టెక్నాలజీతో ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలోనే తీర్చిదిద్దినట్లున్నారు. అందుకే టైటానిక్ క్లైమాక్స్ను మించి రాధేశ్యామ్ పతాక సన్నివేశాలు ఉంటాయని రసూల్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్తో పోలిస్తే.. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ మెరుగ్గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నెల 11న రాధేశ్యామ్ వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 3, 2022 9:39 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…