పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చినందుకు సంతోషించాలో.. వరుసబెట్టి రీమేక్ సినిమాలు చేస్తున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అభిమానులు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రీమేక్ సినిమాల పట్ల ఆసక్తి బాగా తగ్గిపోతోంది. ఇంటర్నెట్ విప్లవం, ఓటీటీల హవా కారణంగా సరిహద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్నారు. మామూలుగానే వేరే భాషల్లో విజయవంతమైన సినిమాలను వెతికి వెతికి చూస్తున్న ప్రేక్షకులు.. ఫలానా సినిమా రీమేక్ అవుతోందని తెలియగానే మరింత ఆసక్తిగా వాటిని చూసేస్తున్నారు.
కథ సహా అన్ని విశేషాలు ముందే తెలిసిపోతున్నాయి. ఎవరైనా స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడంటే.. ఆ సినిమా గురించి ఎడతెగని చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. దీంతో ఎగ్జైట్మెంట్ అంతా పోతోంది. జనాల్లో ఏమాత్రం క్యూరియాసిటీ ఉండట్లేదు.అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి బడా స్టార్ రీమేక్ చేస్తున్నాడంటే సదరు సినిమా విశేషాలన్నీ ఓపెన్ అయిపోయినట్లే.
మార్పులు చేర్పులు చేస్తున్నా సరే.. స్ట్రెయిట్ సినిమా విషయంలో ఉండే ఎగ్జైట్మెంట్లో సగం కూడా ఇక్కడ ఉండదన్నది వాస్తవం. కానీ పవన్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా రీమేక్ల మీద రీమేక్లు చేసుకుపోతున్నాడు. రీఎంట్రీకి రీమేక్, పైగా ‘పింక్’ లాంటి క్లాస్, లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఎంచుకోవడం పట్ల అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కూడా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ను లైన్లో పెట్టడంతో అసంతృప్తి తప్పలేదు. ఈ రెండు చిత్రాలనూ మెరుగ్గానే తీర్చిదిద్దినా కూడా స్ట్రెయిట్ సినిమాలకుండే ఎగ్జైట్మెంట్ మాత్రం వీటికి లేదు. అయ్యిందేదో అయ్యింది.. హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ రాబోతున్నాయి కదా అనుకుంటే ఇప్పుడు మళ్లీ రీమేక్ వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ చిత్రం ‘వినోదియ సిత్తం’ను పవన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని ముందు నుంచే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓకే అయిపోయిందని.. జీ స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి ఒప్పందం కూడా కుదిరిందని.. ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తాడని, త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖర్లో సినిమాకు ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. ఇదే నిజమైతే పవన్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత తప్పదు. రీమేక్ల విషయంలో ఎంత కంఫర్ట్ ఉన్నప్పటికీ.. అభిమానుల అభిరుచికి భిన్నంగా గ్యాప్ ఇవ్వకుండా మళ్లీ మళ్లీ పవన్ అవే చేయడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on March 2, 2022 7:34 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…