గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’. సినిమా అంచనాలకు తగ్గట్లే ఉండటం, భారీగా రిలీజ్ చేయడంతో తొలి రోజు, అలాగే తొలి వీకెండ్లో వసూళ్ల మోత మోగించిందీ సినిమా. మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల షేర్ రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాత్రమే ‘భీమ్లా నాయక్’కు రూ.54 కోట్ల దాకా షేర్ వచ్చింది వీకెండ్లో.
ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ 27 కోట్ల దాకా షేర్ రావడం విశేషమే. ఐతే వీకెండ్ తర్వాత భీమ్లా నాయక్ జోరు తగ్గింది. సోమవారం ఒక్కసారిగా వసూళ్లు పడిపోవడంతో బయ్యర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పాజిటివ్ తెచ్చుకున్నా వీకెండ్ తర్వాత డ్రాప్ సహజమే కానీ.. ‘భీమ్లా నాయక్’ వసూళ్లు అనుకున్నదానికంటే తగ్గాయి. ఐతే మంగళవారం ఈ చిత్రం మళ్లీ బలంగా పుంజుకుంది. శివరాత్రి సెలవును ‘భీమ్లా నాయక్’ పూర్తిగా ఉపయోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది.
మార్నింగ్ షోలకు స్పందన ఓ మోస్తరుగా ఉండగా.. మధ్యాహ్నం నుంచి హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకైతే ‘భీమ్లా నాయక్’ ఊపు మామూలుగా లేదు. అన్ని సెంటర్లలోనూ టికెట్లు దొరకడం కష్టమైపోయింది. అడ్వాన్స్ ఫుల్స్ పడ్డాయి. ప్యాక్డ్ హౌస్లతో థియేటర్లు కళకళలాడాయి. శివరాత్రి కావడంతో మిడ్ నైట్ కూడా చాలా చోట్ల షోలు వేశారు. అవి కూడా ఫుల్ అయ్యాయి. ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘భీమ్లా నాయక్’కు రూ.7 కోట్ల షేర్ రావడం విశేషం.
యుఎస్లో సైతం సోమవారం డ్రాప్ అయిన వసూళ్లు.. మంగళవారం టీ మొబైల్ యాప్ ఆఫర్ల వల్ల పుంజుకున్నాయి. అమెరికాలో తొలి వీకెండ్లోనే 2 మిలియన్ మార్కును టచ్ చేసిన ‘భీమ్లా నాయక్’.. మంగళవారం 1.75 లక్షల డాలర్లు వసూలు చేసింది. వీకెండ్ తర్వాత ఒక్క రోజులో ఇంత వసూళ్లు రావడం విశేషమే. మొత్తంగా అక్కడ ఈ సినిమా వసూల్లు 2.3 మిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. 2.5 మిలియన్ మార్కును ఫుల్ రన్లో అందుకునే ఛాన్సుంది.
This post was last modified on March 2, 2022 4:28 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…