గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’. సినిమా అంచనాలకు తగ్గట్లే ఉండటం, భారీగా రిలీజ్ చేయడంతో తొలి రోజు, అలాగే తొలి వీకెండ్లో వసూళ్ల మోత మోగించిందీ సినిమా. మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల షేర్ రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాత్రమే ‘భీమ్లా నాయక్’కు రూ.54 కోట్ల దాకా షేర్ వచ్చింది వీకెండ్లో.
ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ 27 కోట్ల దాకా షేర్ రావడం విశేషమే. ఐతే వీకెండ్ తర్వాత భీమ్లా నాయక్ జోరు తగ్గింది. సోమవారం ఒక్కసారిగా వసూళ్లు పడిపోవడంతో బయ్యర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పాజిటివ్ తెచ్చుకున్నా వీకెండ్ తర్వాత డ్రాప్ సహజమే కానీ.. ‘భీమ్లా నాయక్’ వసూళ్లు అనుకున్నదానికంటే తగ్గాయి. ఐతే మంగళవారం ఈ చిత్రం మళ్లీ బలంగా పుంజుకుంది. శివరాత్రి సెలవును ‘భీమ్లా నాయక్’ పూర్తిగా ఉపయోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది.
మార్నింగ్ షోలకు స్పందన ఓ మోస్తరుగా ఉండగా.. మధ్యాహ్నం నుంచి హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకైతే ‘భీమ్లా నాయక్’ ఊపు మామూలుగా లేదు. అన్ని సెంటర్లలోనూ టికెట్లు దొరకడం కష్టమైపోయింది. అడ్వాన్స్ ఫుల్స్ పడ్డాయి. ప్యాక్డ్ హౌస్లతో థియేటర్లు కళకళలాడాయి. శివరాత్రి కావడంతో మిడ్ నైట్ కూడా చాలా చోట్ల షోలు వేశారు. అవి కూడా ఫుల్ అయ్యాయి. ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘భీమ్లా నాయక్’కు రూ.7 కోట్ల షేర్ రావడం విశేషం.
యుఎస్లో సైతం సోమవారం డ్రాప్ అయిన వసూళ్లు.. మంగళవారం టీ మొబైల్ యాప్ ఆఫర్ల వల్ల పుంజుకున్నాయి. అమెరికాలో తొలి వీకెండ్లోనే 2 మిలియన్ మార్కును టచ్ చేసిన ‘భీమ్లా నాయక్’.. మంగళవారం 1.75 లక్షల డాలర్లు వసూలు చేసింది. వీకెండ్ తర్వాత ఒక్క రోజులో ఇంత వసూళ్లు రావడం విశేషమే. మొత్తంగా అక్కడ ఈ సినిమా వసూల్లు 2.3 మిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. 2.5 మిలియన్ మార్కును ఫుల్ రన్లో అందుకునే ఛాన్సుంది.
This post was last modified on March 2, 2022 4:28 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…