అక్కినేని నాగచైతన్య తన భార్యతో విడిపోయినప్పటి నుంచి పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టాడు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మనం’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా రిలీజ్ కాకముందే విక్రమ్, చైతు కలిసి మరో ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. అదే ‘దూత’. ఇదొక వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ సంస్థ చైతు-విక్రమ్ కాంబినేషన్ లో వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. నిజానికి చైతుకి హారర్ అంటే పెద్దగా నచ్చదు. కారణమేంటో తెలియదు కానీ ఆయన మాత్రం హారర్ కథలకు చాలా దూరంగా ఉంటారు. ఆ జోనర్ సినిమాలను కూడా చూడరట.
కానీ తొలిసారి ఆయన హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈరోజే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని చైతు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పాటు ఓ కొటేషన్ ని కూడా పోస్ట్ చేశారు. ఈ సిరీస్ లో చైతు జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారని సమాచారం.
ఆయనకు జోడీగా కోలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ నటించనుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే హారర్ కథ అని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందట. మొత్తం మూడు సీజన్లుగా ఈ సిరీస్ ను చిత్రీకరించనున్నారు. మొదటి సీజన్ ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తన డిజిటల్ డెబ్యూతో చైతు ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటారో చూడాలి!
This post was last modified on March 2, 2022 11:09 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…