Movie News

ముగ్గురు మహానటులు.. రైట్స్ 150 కోట్లు

అద్భుతమైన నటనతో అలరిస్తున్నారే తప్ప చాలా యేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు కమల్ హాసన్. అయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గదు. కానీ ఈసారి హిట్టు కొట్టే చాన్స్ ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దానికి వాళ్లు చెబుతున్న కారణం.. ప్రస్తుతం కమల్‌ నటిస్తున్న ‘విక్రమ్‌’ సిసిమా నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ని నూట యాభై కోట్లకి అమ్మినట్లు తెలియడమే. ఇది చిన్న విషయం కాదు. బాక్సాఫీస్‌ దగ్గర కమల్ సినిమా లాభాలు రాబట్టి చాలా కాలమే అయ్యింది. ఇలాంటి సమయంలో ఆయన సినిమాకి ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం నిజంగా విశేషమే.         

లోకేష్ కనకరాజ్  తీస్తున్నాడు కాబట్టి కమల్‌కి ఈసారి హిట్ గ్యారంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఖైదీ, మాస్టర్‌‌ లాంటి చిత్రాలను తన టేకింగ్‌తో అతను ఏ స్థాయిలో నిలబెట్టాడో ఇప్పటికే ప్రేక్షకులు చూశారు. అలాంటి డైరెక్టర్‌‌కి కమల్‌ లాంటి మహానటుడు దొరికాడంటే మరింత అదరగొట్టే అవకాశం ఉంది కదా. దానికి తోడు మరో ఇద్దరు వెర్సటైల్‌ యాక్టర్స్ని కీలక పాత్రలకి లాక్‌ చేసి సినిమా స్థాయినే మార్చేశాడు లోకేష్. 

కమల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ని మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్‌ పోషిస్తున్నాడు. కమల్‌ తర్వాత అంత గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న హీరోలు వీళ్లిద్దరూ. అందుకే వీళ్లు ఈ సినిమాలో నటిస్తున్నారనేసరికి ఒక్కసారిగా మూవీ రేంజ్ పెరిగిపోయింది. ముగ్గురు మహానటుల్ని ఒక్కచోటికి చేర్చిన ఈ సినిమాకి ఆమాత్రం బిజినెస్‌ జరగాలి కదా మరి.         

ఓటీటీ, శాటిలైట్ రైట్స్ని ప్రముఖ సంస్థలు తీసుకున్నాయట. అందుకోసం నిర్మాతకి నూట పదిహేను కోట్లు చెల్లించాయట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్‌ ముప్ఫై ఏడు కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్సే ఇలా ఉంటే ఇక బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ ముగ్గురు హీరోల అభిమానులూ అప్పుడే లెక్కలు కూడా వేసేస్తున్నారు. వారి అంచనాలను లోకేష్‌ నిలబెడితే మంచిదే మరి. 

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago