పైకి కనిపించదు గానీ, చిత్రసీమ ఓ విష వలయం చుట్టూ తిరుగుతుంటుంది. కులం, కుటుంబం – ఇక్కడ పెద్ద పాత్రని పోషిస్తాయి. ఒకరు ఎదిగారంటే… దాని వెనుక కష్టం మాత్రమే ఉండదు. ఇంకేదో బలమైన అంశం… తోడై వస్తుంది. ప్రతిభావంతులు కనుమరుగైపోయారంటే దురదృష్టం మాత్రమే కారణం కాదు, దానికంటే బలమైన ఆయుధం ఏదో వాళ్లని చిదిమేసి ఉంటుంది. దానికి తోడు స్వీయ తప్పిదాలెక్కువ. వాటిలో ఫాల్స్ ప్రెస్టేజీ అతి ముఖ్యమైనది.
హీరోగా నలుగురు కళ్లల్లో పడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ‘హీరో’ అనే ట్యాగ్ తగిలించుకుని తిరగడం – ఖరీదైన విషయమే. అందరితో పాటు లగ్జరీ కారులో తిరగాలి. గేటెడ్ కమ్యునిటీలో ఓ ఫ్లాటుండాలి. దర్శకుడెవరైనా కథ చెప్పడానికి రావడానికి.. ఓ ఆఫీసంటూ తెరవాలి. పీఆర్ని మెంటైన్ చేయాలి. పర్సనల్ మేకప్మెన్, కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ డ్రస్సెర్, పార్టీలకూ, సినిమా వేడుకలకు వెళ్లినప్పుడు కొత్త కొత్త దుస్తులు, వేసిన షూ మళ్లీ వేయకపోవడం… ఇలా ఎన్ని హంగులో. సినిమాలున్నంతకాలం ఇలాంటి ఖర్చులకు ఢోకా ఉండదు. కానీ అవకాశాలు తగ్గిపోతే, ఫ్లాపులు ఎదురైతే, పారితోషికాలు అందకపోతే..? – నెల తిరిగేసరికి లక్షలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాల్లేవు కదా, లగ్జరీ ఆపేద్దామంటే కుదరని పని. లేనప్పుడే ఇంకా డాబు చూపించాలి. సినిమాలతో సంపాదించుకున్నవన్నీ రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి పెట్టేస్తుంటారు. కార్లు కొనేస్తారు. వాటిని నెలసరి అవసరాల కోసం అమ్ముకోవడం కుదరదు. అందుకే వాటిని తీయలేరు. అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. వాటిని తీర్చడానికి కథలు నచ్చకపోయినా, కొన్నిసార్లు డబ్బుల కోసం సినిమాలు చేయాల్సివస్తుంటుంది. అలా.. హీరోల్ని ఫ్లాపులు చుట్టుముడుతుంటాయి. ఆ తరవాత.. వాళ్ల జీవితాలు మరింత భారం అవుతాయి.
ఇండ్రస్ట్రీలోని కొంతమంది పెద్ద నటులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ, అజ్ఞాతవాసంలో ఉండిపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. ఎక్కడాలేనంత డిప్రెషన్, మానసిక సమస్యలూ… చిత్రసీమలోనే ఎందుకు ఉంటాయి? అనడానికి ప్రధానమైన కారణం ఫాల్స్ ప్రెస్టేజే. దీన్ని దాటుకుని సింపుల్ జీవితానికి అలవాటు పడడం సినిమావాళ్లు అలవాటు చేసుకోవాలి. దాన్నో ప్రాక్టీస్ గా మొదలెట్టాలి. నా చుట్టూ ఎంత డబ్బున్నా, ఎన్ని హంగులున్నా నేను సింపుల్ గా బతకడానికే ఇష్టపడతా అని చెప్పడం కాదు. దాన్ని ఆచరించాలి. అదే చాలా మానసిక సమస్యలకు మందుగా పని చేస్తుంది.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…