పైకి కనిపించదు గానీ, చిత్రసీమ ఓ విష వలయం చుట్టూ తిరుగుతుంటుంది. కులం, కుటుంబం – ఇక్కడ పెద్ద పాత్రని పోషిస్తాయి. ఒకరు ఎదిగారంటే… దాని వెనుక కష్టం మాత్రమే ఉండదు. ఇంకేదో బలమైన అంశం… తోడై వస్తుంది. ప్రతిభావంతులు కనుమరుగైపోయారంటే దురదృష్టం మాత్రమే కారణం కాదు, దానికంటే బలమైన ఆయుధం ఏదో వాళ్లని చిదిమేసి ఉంటుంది. దానికి తోడు స్వీయ తప్పిదాలెక్కువ. వాటిలో ఫాల్స్ ప్రెస్టేజీ అతి ముఖ్యమైనది.
హీరోగా నలుగురు కళ్లల్లో పడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ‘హీరో’ అనే ట్యాగ్ తగిలించుకుని తిరగడం – ఖరీదైన విషయమే. అందరితో పాటు లగ్జరీ కారులో తిరగాలి. గేటెడ్ కమ్యునిటీలో ఓ ఫ్లాటుండాలి. దర్శకుడెవరైనా కథ చెప్పడానికి రావడానికి.. ఓ ఆఫీసంటూ తెరవాలి. పీఆర్ని మెంటైన్ చేయాలి. పర్సనల్ మేకప్మెన్, కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ డ్రస్సెర్, పార్టీలకూ, సినిమా వేడుకలకు వెళ్లినప్పుడు కొత్త కొత్త దుస్తులు, వేసిన షూ మళ్లీ వేయకపోవడం… ఇలా ఎన్ని హంగులో. సినిమాలున్నంతకాలం ఇలాంటి ఖర్చులకు ఢోకా ఉండదు. కానీ అవకాశాలు తగ్గిపోతే, ఫ్లాపులు ఎదురైతే, పారితోషికాలు అందకపోతే..? – నెల తిరిగేసరికి లక్షలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాల్లేవు కదా, లగ్జరీ ఆపేద్దామంటే కుదరని పని. లేనప్పుడే ఇంకా డాబు చూపించాలి. సినిమాలతో సంపాదించుకున్నవన్నీ రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి పెట్టేస్తుంటారు. కార్లు కొనేస్తారు. వాటిని నెలసరి అవసరాల కోసం అమ్ముకోవడం కుదరదు. అందుకే వాటిని తీయలేరు. అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. వాటిని తీర్చడానికి కథలు నచ్చకపోయినా, కొన్నిసార్లు డబ్బుల కోసం సినిమాలు చేయాల్సివస్తుంటుంది. అలా.. హీరోల్ని ఫ్లాపులు చుట్టుముడుతుంటాయి. ఆ తరవాత.. వాళ్ల జీవితాలు మరింత భారం అవుతాయి.
ఇండ్రస్ట్రీలోని కొంతమంది పెద్ద నటులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ, అజ్ఞాతవాసంలో ఉండిపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. ఎక్కడాలేనంత డిప్రెషన్, మానసిక సమస్యలూ… చిత్రసీమలోనే ఎందుకు ఉంటాయి? అనడానికి ప్రధానమైన కారణం ఫాల్స్ ప్రెస్టేజే. దీన్ని దాటుకుని సింపుల్ జీవితానికి అలవాటు పడడం సినిమావాళ్లు అలవాటు చేసుకోవాలి. దాన్నో ప్రాక్టీస్ గా మొదలెట్టాలి. నా చుట్టూ ఎంత డబ్బున్నా, ఎన్ని హంగులున్నా నేను సింపుల్ గా బతకడానికే ఇష్టపడతా అని చెప్పడం కాదు. దాన్ని ఆచరించాలి. అదే చాలా మానసిక సమస్యలకు మందుగా పని చేస్తుంది.
This post was last modified on June 17, 2020 12:00 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…