రాష్ట్రంలోని సినిమా థియేటర్లపై ప్రభుత్వం కత్తికట్టింది. మరోమాటలో చెప్పాలంటే.. ప్రభుత్వమే రాజకీయ వ్యూహంలో భాగంగా కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని అనుకోవచ్చు. ఎక్కడికక్కడ రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంతో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. విస్సన్నపేటలోని ఓ థియేటర్లో టికెట్ ధర రూ. 35 చొప్పున ఆడించలేమంటూ యాజమాన్యం చేతులెత్తేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమా ప్రదర్శనపై రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్సన్నపేటలోని ఓ థియేటర్లో టికెట్ రూ. 35 చొప్పున ఆడించలేమంటూ థియేటర్ యాజమాన్యం చేతులెత్తేయడంతో ఆందోళన చేపట్టారు.
ఇలా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉండడంతో సినిమా ప్రదర్శించాలంటూ థియేటర్ల ముందు పవన్ కల్యాణ్ అభిమానులు బారులు తీరారు. విస్సన్నపేట తిరువూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
మైలవరంలో భీమ్ల నాయక్ చిత్ర ప్రదర్శనను సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. తగ్గించిన టికెట్ ధరలతో నడపలేమని నిర్వాహకులు గేటుకు నోటీసులు అంటించారు. వాస్తవానికి పొరుగు రాష్ట్రంలో రూ.150 కి పైమాటే ఈ టికెట్ ధరలు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఇంకా సినిమా టికెట్ల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
This post was last modified on February 25, 2022 12:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…