పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్ విడుదల ఈ రోజే. ఇది మలయాళ బ్లాక్బస్టర్ అయ్యప్పనుం కోషీయుంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాన్ని ప్రకటించినపుడు రీమేకే కదా అని లైట్ తీసుకున్నారు జనాలు. కానీ పవన్ సినిమా అంటే.. రీమేక్ అయినా, స్ట్రెయిట్ అయినా, ఏ కాంబినేషన్లో చేసినా.. విడుదల సమయానికి హైప్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది.
భీమ్లా నాయక్కు హైప్ ఇంకాస్త ఎక్కువే వచ్చింది. భీమ్లా నాయక్కు సంబంధించిన ప్రతి ప్రోమో కూడా ఎగ్జైటింగ్గా ఉండటంతో రిలీజ్ టైం వచ్చేసరికి క్రేజ్ మల్టిప్లై అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి భీమ్లా నాయక్కు.
ఐతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ల నియంత్రణ కొనసాగుతుండటంతో వసూళ్లపై గట్టి ప్రభావమే పడేలా ఉంది. అయినప్పటికీ సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే.. పవన్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఓ ఘనతను ఈ సినిమాతో పవర్ స్టార్ అందుకుంటాడనే అనిపిస్తోంది. పవన్ తర్వాత వచ్చిన హీరోలు కూడా వంద కోట్ల షేర్ మార్కును టచ్ చేయగా.. సరైన టైంలో సరైన సినిమాలు పడక పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఆ క్లబ్బులో చేరలేదు.
గత ఏడాది వకీల్ సాబ్తో క్లబ్బులో అడుగు పెట్టేలాగే కనిపించాడు కానీ.. ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపుకు తోడు.. కొవిడ్ కారణంగా మధ్యలో థియేట్రికల్ రన్ ఆగిపోవడంతో 90 కోట్ల ప్లస్ షేర్తో సరిపెట్టుకుంది ఆ చిత్రం. ఐతే భీమ్లా నాయక్కు ఉన్న క్రేజ్.. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు.. తెలుగు రాష్ట్రాల అవతల కూడా సినిమాకున్న క్రేజ్, భారీ రిలీజ్ దృష్ట్యా వంద కోట్ల షేర్ మార్కును టచ్ చేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on February 25, 2022 9:50 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…