కొవిడ్ దెబ్బకు కుదేలైన ఫిలిం ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మంచి సహకారమే అందిస్తోంది. ఓవైపు ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించి, అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో ఉక్కు పాదం మోపుతుంటే తెలంగాణ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచారు. పైగా పెద్ద సినిమాలకు తొలి రెండు వారాలు ఇంకా రేట్లు పెంచుకోవడానికి అవకాశమిస్తున్నారు. అలాగే అదనపు షోలు వేసుకోవడానికి కూడా సులువుగా అనుమతులు లభిస్తున్నాయి.
బెనిఫిట్ షోలు లేవన్న మాటే తప్ప ఇంకే ఇబ్బందీ లేదు. ఈ శుక్రవారం రిలీజవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్కు ఆల్రెడీ రెండు వారాల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. దీనికి తోడు ఇప్పుడు ఐదో షోకు కూడా అనుమతులు వచ్చేశాయి. బుధవారం సాయంత్రం నుంచే తెలంగాణ అంతటా ఐదో షోలు అందుబాటులోకి వచ్చేశాయి.
బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇప్పటికే తొలి రోజు మొత్తానికి ఉన్న షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోవడంతో.. ఈ ఎక్స్ ట్రా షో కోసమే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్లు అయిపోయాయి. తొలి రోజు మొత్తానికి ఎక్కడా ఇప్పుడు టికెట్లు దాదాపు అందుబాటులో లేవు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రాలో అందుకు పూర్తి భిన్నం.
అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేయడానికి వీల్లేదని అక్కడి అధికారులు నొక్కి వక్కాణిస్తున్నారు. తెలియకుండా, అనధికారికంగా షోలు వేస్తారేమో అని పోలీసులు తొలి రోజు ఉదయం నుంచి భీమ్లా నాయక్ థియేటర్ల దగ్గర తనిఖీలకు వెళ్లబోతున్నారట. కొత్త టికెట్ల ధరలు ఈపాటికే అమల్లోకి రావాల్సి ఉన్నా.. ఈ చిత్రానికి ప్రయోజనం దక్కకూడదన్న ఉద్దేశంతో కావాలనే జీవోను ఆపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…