కొవిడ్ దెబ్బకు కుదేలైన ఫిలిం ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మంచి సహకారమే అందిస్తోంది. ఓవైపు ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించి, అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో ఉక్కు పాదం మోపుతుంటే తెలంగాణ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచారు. పైగా పెద్ద సినిమాలకు తొలి రెండు వారాలు ఇంకా రేట్లు పెంచుకోవడానికి అవకాశమిస్తున్నారు. అలాగే అదనపు షోలు వేసుకోవడానికి కూడా సులువుగా అనుమతులు లభిస్తున్నాయి.
బెనిఫిట్ షోలు లేవన్న మాటే తప్ప ఇంకే ఇబ్బందీ లేదు. ఈ శుక్రవారం రిలీజవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్కు ఆల్రెడీ రెండు వారాల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. దీనికి తోడు ఇప్పుడు ఐదో షోకు కూడా అనుమతులు వచ్చేశాయి. బుధవారం సాయంత్రం నుంచే తెలంగాణ అంతటా ఐదో షోలు అందుబాటులోకి వచ్చేశాయి.
బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇప్పటికే తొలి రోజు మొత్తానికి ఉన్న షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోవడంతో.. ఈ ఎక్స్ ట్రా షో కోసమే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్లు అయిపోయాయి. తొలి రోజు మొత్తానికి ఎక్కడా ఇప్పుడు టికెట్లు దాదాపు అందుబాటులో లేవు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రాలో అందుకు పూర్తి భిన్నం.
అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేయడానికి వీల్లేదని అక్కడి అధికారులు నొక్కి వక్కాణిస్తున్నారు. తెలియకుండా, అనధికారికంగా షోలు వేస్తారేమో అని పోలీసులు తొలి రోజు ఉదయం నుంచి భీమ్లా నాయక్ థియేటర్ల దగ్గర తనిఖీలకు వెళ్లబోతున్నారట. కొత్త టికెట్ల ధరలు ఈపాటికే అమల్లోకి రావాల్సి ఉన్నా.. ఈ చిత్రానికి ప్రయోజనం దక్కకూడదన్న ఉద్దేశంతో కావాలనే జీవోను ఆపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 24, 2022 9:25 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…