కొవిడ్ దెబ్బకు కుదేలైన ఫిలిం ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మంచి సహకారమే అందిస్తోంది. ఓవైపు ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించి, అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో ఉక్కు పాదం మోపుతుంటే తెలంగాణ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచారు. పైగా పెద్ద సినిమాలకు తొలి రెండు వారాలు ఇంకా రేట్లు పెంచుకోవడానికి అవకాశమిస్తున్నారు. అలాగే అదనపు షోలు వేసుకోవడానికి కూడా సులువుగా అనుమతులు లభిస్తున్నాయి.
బెనిఫిట్ షోలు లేవన్న మాటే తప్ప ఇంకే ఇబ్బందీ లేదు. ఈ శుక్రవారం రిలీజవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్కు ఆల్రెడీ రెండు వారాల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. దీనికి తోడు ఇప్పుడు ఐదో షోకు కూడా అనుమతులు వచ్చేశాయి. బుధవారం సాయంత్రం నుంచే తెలంగాణ అంతటా ఐదో షోలు అందుబాటులోకి వచ్చేశాయి.
బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇప్పటికే తొలి రోజు మొత్తానికి ఉన్న షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోవడంతో.. ఈ ఎక్స్ ట్రా షో కోసమే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్లు అయిపోయాయి. తొలి రోజు మొత్తానికి ఎక్కడా ఇప్పుడు టికెట్లు దాదాపు అందుబాటులో లేవు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రాలో అందుకు పూర్తి భిన్నం.
అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేయడానికి వీల్లేదని అక్కడి అధికారులు నొక్కి వక్కాణిస్తున్నారు. తెలియకుండా, అనధికారికంగా షోలు వేస్తారేమో అని పోలీసులు తొలి రోజు ఉదయం నుంచి భీమ్లా నాయక్ థియేటర్ల దగ్గర తనిఖీలకు వెళ్లబోతున్నారట. కొత్త టికెట్ల ధరలు ఈపాటికే అమల్లోకి రావాల్సి ఉన్నా.. ఈ చిత్రానికి ప్రయోజనం దక్కకూడదన్న ఉద్దేశంతో కావాలనే జీవోను ఆపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 24, 2022 9:25 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…