తెలుగు సినిమా టైటిల్ పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. టైటిల్ క్యాచీగా ఉండాలి. పద్ధతిగా ఉండాలి. దానికి ఎలాంటి లిటిగేషన్లూ ఎదురు కాకూడదు. ఏదైనా పవర్ఫుల్ పేరో, పదమో వాడుకుంటే.. అదో కొత్త తలనొప్పి. ఆ పేరుతో సంబంధం ఉన్నవాళ్లంతా పొలో మంటూ.. వెంటపడతారు. ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ విడుదలకు అడ్డుకట్ట వేస్తారు.
సరిగ్గా ‘భానుమతి రామకృష్ణ’కి అదే జరుగుతుతోంది. ‘అందాల రాక్షసి ఫేమ్’ నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్వరలోనే ఓటీటీలో రాబోతోంది. చిత్రబృందం ఓటీటీ విడుదలకు సన్నాహాలు చేస్తుంటే, ఇప్పుడు టైటిల్ టెన్షన్ వచ్చి పడింది. అలనాటి నటి భానుమతి రామకృష్ణ కుటుంబ సభ్యులు ఈ టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మా అనుమతి లేనిదే టైటిల్ ఎలా వాడుకుంటారని వాళ్ల మొదటి ప్రశ్న. ఆ టైటిల్ పెట్టి, భానుమతిని కించపరిచే దృశ్యాలతో సినిమా తీశారన్నది మరో వాదన. మొదటి అభ్యంతరం సరైనదే. ఇక రెండోదంటారా? భానుమతిని కించపరిచారా, లేదా? అనేది సినిమా విడుదలైతే గానీ తెలీదు.
అందుకే చిత్రబృందం.. ‘ముందు మీకు ఈ సినిమా చూపిస్తాం. అప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఆయా సన్నివేశాలు తొలగిస్తాం’ అంటూ వివరణ ఇచ్చుకుంది. ‘భానుమతి రామకృష్ణ’ ఓ ఫ్యామిలీ డ్రామా. ఇందులో వివాదాస్పదమైన అంశాలు ఉండే ఛాన్సు లేదు. కాకపోతే.. భానుమతి పేరుతో ఓ బయోపిక్ నిర్మించాలని దానికి ‘భానుమతి రామకృష్ణ’ అనే టైటిల్ పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పేరు మరో సినిమా వాడుకుంటే.. ఇబ్బందే కదా, అందుకే టైటిల్ విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు చెబుతున్నారంతే. ఏదేమైనా.. ఈ చిన్న సినిమాకి ఈ విధంగా కాస్త పబ్లిసిటీ వచ్చినట్టైంది. అంతే.
This post was last modified on June 16, 2020 4:10 pm
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…