నరసాపురంలో జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరగా చేసిన ప్రకటనపైనే అందరు చర్చించుకుంటున్నారు. బహిరంగ సభ ముగిసే ముందు మార్చి 14వ తేదీన జరగబోయే పార్టీ ఆవిర్భావ సభలో కలుద్దామని చెప్పారు. ఆ రోజున రాష్ట్ర భవిష్యత్ ఎలాగుండాలి ? ఎలా ఉండబోతోంది ? 2024 ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయంపై చర్చిద్దామని పవన్ చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎవరితో పొత్తులుంటాయనే విషయంపై పవన్ క్లారిటీ ఇస్తారని జనాలు అనుకుంటున్నారు.
నిజానికి బీజేపీకి జనసేన మిత్రపక్షమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండు పార్టీల మధ్య ఉండాల్సిన సఖ్యత ఏ రోజూ లేవు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు, నిరసనలు దాదాపు లేవనే చెప్పాలి. నరసాపురంలో ఇపుడు జరిగిన బహిరంగ సభ కూడా జనసేన సొంతంగా చేసుకున్నదే కానీ బీజేపీని కలుపుకోలేదు. అందుకనే మిత్రపక్షాలు ఎప్పుడైనా విడిపోవచ్చని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.
ఇదే సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు బహిరంగంగానే పంపిన లవ్ ప్రపోజల్ కూడా అందరికీ తెలిసిందే. నిజానికి బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు చంద్రబాబు లవ్ ప్రపోజల్ పంపకూడదు. రాబోయే ఎన్నికల్లో గెలవటం చంద్రబాబుకు అత్యంత కీలకం. రేపటి ఎన్నికల్లో కనుక టీడీపీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. క్యాడర్ చాలా డీలా పడుతుంది
అందుకనే చంద్రబాబు పొత్తులకు సందేహించడం లేదు. ప్రస్తుతం బీజేపీతో పవన్ ఉన్నా లేనట్లే అన్నట్టుంది. ఈ నేపథ్యంలో పవన్ తో పొత్తుకు బాబు ఓపెన్ ఆహ్వానం ఇచ్చేశారు. రాజకీయంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో మార్చి 14వ తేదీన అన్నీ విషయాలను మాట్లాడుకుందామని పవన్ అనటంలో ఉద్దేశ్యం పొత్తుల విషయంపై క్లారిటి ఇవ్వటమే అనే చర్చ మొదలైంది. మరి మార్చి 14వ తేదీన పవన్ ఏమి చెబుతారో వినాల్సిందే.
This post was last modified on February 21, 2022 12:40 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…