నరసాపురంలో జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరగా చేసిన ప్రకటనపైనే అందరు చర్చించుకుంటున్నారు. బహిరంగ సభ ముగిసే ముందు మార్చి 14వ తేదీన జరగబోయే పార్టీ ఆవిర్భావ సభలో కలుద్దామని చెప్పారు. ఆ రోజున రాష్ట్ర భవిష్యత్ ఎలాగుండాలి ? ఎలా ఉండబోతోంది ? 2024 ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయంపై చర్చిద్దామని పవన్ చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎవరితో పొత్తులుంటాయనే విషయంపై పవన్ క్లారిటీ ఇస్తారని జనాలు అనుకుంటున్నారు.
నిజానికి బీజేపీకి జనసేన మిత్రపక్షమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండు పార్టీల మధ్య ఉండాల్సిన సఖ్యత ఏ రోజూ లేవు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు, నిరసనలు దాదాపు లేవనే చెప్పాలి. నరసాపురంలో ఇపుడు జరిగిన బహిరంగ సభ కూడా జనసేన సొంతంగా చేసుకున్నదే కానీ బీజేపీని కలుపుకోలేదు. అందుకనే మిత్రపక్షాలు ఎప్పుడైనా విడిపోవచ్చని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.
ఇదే సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు బహిరంగంగానే పంపిన లవ్ ప్రపోజల్ కూడా అందరికీ తెలిసిందే. నిజానికి బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు చంద్రబాబు లవ్ ప్రపోజల్ పంపకూడదు. రాబోయే ఎన్నికల్లో గెలవటం చంద్రబాబుకు అత్యంత కీలకం. రేపటి ఎన్నికల్లో కనుక టీడీపీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. క్యాడర్ చాలా డీలా పడుతుంది
అందుకనే చంద్రబాబు పొత్తులకు సందేహించడం లేదు. ప్రస్తుతం బీజేపీతో పవన్ ఉన్నా లేనట్లే అన్నట్టుంది. ఈ నేపథ్యంలో పవన్ తో పొత్తుకు బాబు ఓపెన్ ఆహ్వానం ఇచ్చేశారు. రాజకీయంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో మార్చి 14వ తేదీన అన్నీ విషయాలను మాట్లాడుకుందామని పవన్ అనటంలో ఉద్దేశ్యం పొత్తుల విషయంపై క్లారిటి ఇవ్వటమే అనే చర్చ మొదలైంది. మరి మార్చి 14వ తేదీన పవన్ ఏమి చెబుతారో వినాల్సిందే.
This post was last modified on February 21, 2022 12:40 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…