అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ స్టేటస్ను దక్కించుకున్న వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా కెరీర్ స్టార్ చేసిన ఈయన.. నందమూరి కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `పటాస్` మూవీతో డైరెక్టర్గా ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుస హిట్ చిత్రాలను రూపొందించి అపజయం అంటూ లేని దర్శకుల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకున్నారు.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నన్ను ర్యాగింగ్ చేశాడంటూ ఓ షాకింగ్ విషయాన్ని కూడా బయట పెట్టేశారు. `పటాస్ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తరచూ ఆఫీస్కి వస్తుండేవారు. ఆయన వచ్చినప్పుడల్లా నన్ను తెగ ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్ అంటే బాధ పెట్టడం కాదు అల్లరి చేస్తూ నా పై జోకులు వేసేవారు. నాకది ఎంతో మెమరబుల్ ఎక్స్పీరియన్స్` అంటూ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
దాంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
This post was last modified on February 21, 2022 3:35 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…