ఒకప్పుడు తెలుగు సినిమాలు యుఎస్లో ఏ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించేవో అందరికీ తెలిసిందే. మంచి క్రేజున్న సినిమాలకు ప్రిమియర్స్తోనే మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేవి. ఐతే కొవిడ్,ఇతర కారణాల వల్ల మూడేళ్లుగా ఏ తెలుగు చిత్రానికీ యుఎస్లో ప్రిమియర్స్తో మిలియన్ డాలర్ల వసూళ్లు రాలేదు. చివరగా ఈ ఘనత అందుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ కావడం గమనార్హం. ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినప్పటికీ.. విడుదలకు ముందు దానికి క్రేజ్ మామూలుగా లేదు.
దీంతో యుఎస్ ప్రిమియర్స్కు వసూళ్ల మోత మోగిపోయింది. ఏకంగా 1.4 మిలియన్ డాలర్లను కేవలం ప్రిమియర్స్తోనే వసూలు చేసింది ‘అజ్ఞాతవాసి’. బాహుబలి: ది బిగినింగ్, ఖైదీ నంబర్ 150 చిత్రాల రికార్డులను ఆ సినిమా బద్దలు కొట్టింది. ఐతే తర్వాతి మూడేళ్లలో మరే చిత్రం కూడా ఈ రికార్డును టచ్ చేయలేకపోయింది. కొవిడ్ దెబ్బకు యుఎస్లో భారతీయ చిత్రాలన్నింటికీ వసూళ్లు పడిపోయాయి. ఇప్పుడిప్పుడే అక్కడ బాక్సాఫీస్ పుంజుకుంటోంది.
ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమానే మళ్లీ ప్రిమియర్స్తో మిలియన్ డాలర్ల మార్కును అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్ర విడుదల విషయంలో విపరీతమైన సందిగ్ధత నడిచింది. నాలుగు రోజుల కిందటే దీని రిలీజ్ ఖరారైంది. ఇలా డేట్ ఇచ్చారో లేదో అలా యుఎస్ ప్రిమియర్స్కు బుకింగ్స్ మొదలుపెట్టేశారు.
ప్రిమియర్స్కు ఐదు రోజుల ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్తో 2 లక్షల డాలర్ల మార్కును దాటేయడం విశేషం. ఈ ఊపు చూస్తుంటే ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి వసూళ్లు మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం కష్టమేమీ కాదనిపిస్తోంది. ట్రైలర్ రిలీజయ్యాక హైప్ మరింత పెరుగుతుంది కాబట్టి ఈ రికార్డు అందుకోవడం సాధ్యమే అనిపిస్తోంది. అలా కాని పక్షంలో 8-9 లక్షల డాలర్ల మధ్య సెటిలయ్యే ఛాన్సులున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వీకెండ్లో 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
This post was last modified on February 20, 2022 8:03 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…