Movie News

భీమ్లా ఫిక్స్.. అవి రెండూ ఔట్

ఫిబ్రవరి చివరి వారం కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఈ వీకెండ్లో రాబోయేది ఒక్క ‘భీమ్లా నాయక్’ సినిమా మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఎదురెళ్లే సాహసం మరే చిత్రం చేసే అవకాశం లేదని సమాచారం. ఆ వారాంతానికి షెడ్యూల్ అయిన తెలుగు సినిమాలన్నీ వాయిదా పడినట్లే. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సింది. ఈ మేరకు అంతర్గతంగా ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసినట్లు తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం సినిమా ‘సెబాస్టియన్’ ఆల్రెడీ వాయిదా పడిపోగా.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘గని’ చిత్రాల సంగతే ఎటూ తేలకుండా ఉంది మొన్నటి వరకు. ‘భీమ్లా నాయక్’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వీటి విషయంలో అయోమయం మొదలైంది. పవన్ సినిమా వస్తే వరుణ్ తేజ్ మూవీ అదే వీకెండ్లో రావడం అసాధ్యం. కాబట్టి ‘గని’ వాయిదా పక్కా అని తేలిపోయింది.

ఐతే ‘భీమ్లా నాయక్’ అనౌన్స్‌మెంట్ వచ్చాక కూడా శర్వా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం నొక్కి వక్కాణించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన కూడా వచ్చింది. కానీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న శర్వాకు ‘ఆడవాళ్ళు..’ సక్సెస్ చాలా అవసరం. ఇలాంటి స్థితిలో ‘భీమ్లా నాయక్’కు పోటీగా దీన్ని దించడం పెద్ద రిస్క్ అని అర్థం చేసుకుని సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

‘భీమ్లా నాయక్’ పక్కాగా 25నే వస్తుందా అనే విషయంలో కొంత సందిగ్ధత నడిచినప్పటికీ.. ఇప్పుడు అది తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో జోరుగా టికెట్ల అమ్మకాలు జరిగిపోతున్నాయి. మరోవైపు శుక్రవారమే సెన్సార్ కూడా చేయించేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ కూడా రెడీ అవుతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్లో ప్రకటన చేసింది. కాబట్టి 25న ‘భీమ్లా నాయక్’ రావడం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు, గని చిత్రాలు వాయిదా పడటం లాంఛనమే. ఆ రెండు చిత్రాలను వారం ఆలస్యంగా మార్చి 4న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

This post was last modified on February 18, 2022 4:08 pm

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

19 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago