ఫిబ్రవరి చివరి వారం కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఈ వీకెండ్లో రాబోయేది ఒక్క ‘భీమ్లా నాయక్’ సినిమా మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఎదురెళ్లే సాహసం మరే చిత్రం చేసే అవకాశం లేదని సమాచారం. ఆ వారాంతానికి షెడ్యూల్ అయిన తెలుగు సినిమాలన్నీ వాయిదా పడినట్లే. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సింది. ఈ మేరకు అంతర్గతంగా ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసినట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం సినిమా ‘సెబాస్టియన్’ ఆల్రెడీ వాయిదా పడిపోగా.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘గని’ చిత్రాల సంగతే ఎటూ తేలకుండా ఉంది మొన్నటి వరకు. ‘భీమ్లా నాయక్’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వీటి విషయంలో అయోమయం మొదలైంది. పవన్ సినిమా వస్తే వరుణ్ తేజ్ మూవీ అదే వీకెండ్లో రావడం అసాధ్యం. కాబట్టి ‘గని’ వాయిదా పక్కా అని తేలిపోయింది.
ఐతే ‘భీమ్లా నాయక్’ అనౌన్స్మెంట్ వచ్చాక కూడా శర్వా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం నొక్కి వక్కాణించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన కూడా వచ్చింది. కానీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న శర్వాకు ‘ఆడవాళ్ళు..’ సక్సెస్ చాలా అవసరం. ఇలాంటి స్థితిలో ‘భీమ్లా నాయక్’కు పోటీగా దీన్ని దించడం పెద్ద రిస్క్ అని అర్థం చేసుకుని సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
‘భీమ్లా నాయక్’ పక్కాగా 25నే వస్తుందా అనే విషయంలో కొంత సందిగ్ధత నడిచినప్పటికీ.. ఇప్పుడు అది తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఓవర్సీస్లో జోరుగా టికెట్ల అమ్మకాలు జరిగిపోతున్నాయి. మరోవైపు శుక్రవారమే సెన్సార్ కూడా చేయించేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ కూడా రెడీ అవుతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్లో ప్రకటన చేసింది. కాబట్టి 25న ‘భీమ్లా నాయక్’ రావడం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు, గని చిత్రాలు వాయిదా పడటం లాంఛనమే. ఆ రెండు చిత్రాలను వారం ఆలస్యంగా మార్చి 4న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on February 18, 2022 4:08 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…