పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ట్రీన్ ప్లే అందించారు. మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్ల నాయక్గా, రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేనియర్ శేఖర్గా కనిపించబోతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫిబ్రవరి 25న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే.. మొదట ఈ మూవీ రన్ టైమ్ను రెండు గంటల ఇరవై నిమిషాలకు మాత్రమే లాక్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమాకు అంత తక్కువ నిడివి అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ విషయంపై తెగ ఫీల్ అయిపోయారు.
పవన్ సినిమాకు అంత తక్కువ రన్ టైమ్ ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. `భీమ్లా నాయక్` సినిమా నిడివి మరో 12 నిమిషాలు పెంచారట. మూడు గంటలు దాటడంతో గతంలో కొన్ని సీన్లను, ఓ పాటను తొలగించారట. కానీ ఫైనల్ కాఫీలో నిడివి బాగా తగ్గిపోవడంతో ఎడిటింగ్లో తొలగించిన కొన్ని సీన్లను మరియు ఆ సాంగ్ను తిరిగి యాడ్ చేశారనే టాక్ తాజాగా బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది.
దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్గా చిల్ అయిపోయారని తెలుస్తోంది. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో పవన్కు జోడీగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్లు అలరించనున్నారు. అలాగే ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
This post was last modified on February 18, 2022 12:41 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…