పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ట్రీన్ ప్లే అందించారు. మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్ల నాయక్గా, రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేనియర్ శేఖర్గా కనిపించబోతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫిబ్రవరి 25న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే.. మొదట ఈ మూవీ రన్ టైమ్ను రెండు గంటల ఇరవై నిమిషాలకు మాత్రమే లాక్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమాకు అంత తక్కువ నిడివి అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ విషయంపై తెగ ఫీల్ అయిపోయారు.
పవన్ సినిమాకు అంత తక్కువ రన్ టైమ్ ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. `భీమ్లా నాయక్` సినిమా నిడివి మరో 12 నిమిషాలు పెంచారట. మూడు గంటలు దాటడంతో గతంలో కొన్ని సీన్లను, ఓ పాటను తొలగించారట. కానీ ఫైనల్ కాఫీలో నిడివి బాగా తగ్గిపోవడంతో ఎడిటింగ్లో తొలగించిన కొన్ని సీన్లను మరియు ఆ సాంగ్ను తిరిగి యాడ్ చేశారనే టాక్ తాజాగా బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది.
దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్గా చిల్ అయిపోయారని తెలుస్తోంది. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో పవన్కు జోడీగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్లు అలరించనున్నారు. అలాగే ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
This post was last modified on February 18, 2022 12:41 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…