పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ట్రీన్ ప్లే అందించారు. మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్ల నాయక్గా, రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేనియర్ శేఖర్గా కనిపించబోతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫిబ్రవరి 25న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే.. మొదట ఈ మూవీ రన్ టైమ్ను రెండు గంటల ఇరవై నిమిషాలకు మాత్రమే లాక్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమాకు అంత తక్కువ నిడివి అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ విషయంపై తెగ ఫీల్ అయిపోయారు.
పవన్ సినిమాకు అంత తక్కువ రన్ టైమ్ ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. `భీమ్లా నాయక్` సినిమా నిడివి మరో 12 నిమిషాలు పెంచారట. మూడు గంటలు దాటడంతో గతంలో కొన్ని సీన్లను, ఓ పాటను తొలగించారట. కానీ ఫైనల్ కాఫీలో నిడివి బాగా తగ్గిపోవడంతో ఎడిటింగ్లో తొలగించిన కొన్ని సీన్లను మరియు ఆ సాంగ్ను తిరిగి యాడ్ చేశారనే టాక్ తాజాగా బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది.
దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్గా చిల్ అయిపోయారని తెలుస్తోంది. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో పవన్కు జోడీగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్లు అలరించనున్నారు. అలాగే ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
This post was last modified on February 18, 2022 12:41 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…