సినీనటుడు రాంచరణ్ తేజ్ కు చెందిన విమానయాన కంపెనీ సమస్యల్లో ఉందా? ఆయన చైర్మన్గా ఉన్న హైదరాబాద్కు చెందిన ఎయిర్లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్లను ఆపేసిన నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేసేయడంతో కంపెనీలో ఏం జరుగుతోంది అనే టాక్ తెరమీదకు వచ్చింది. రామ్చరణ్కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు.
ట్రూజెట్ 2015, జులైలో తన సర్వీస్లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ట్రూజెట్లో మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 90 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో వాటాలున్న రామ్చరణ్కు ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్తో కంపెనీ పుంజుకుంటుందన్న సమయంలో కరోనా వచ్చి పడింది.
మరోవైపు, ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. డిమాండ్ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్మెంట్ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వానంగా తయారయ్యింది. తన సర్వీస్లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిర్ కోస్టా, ఎయిర్ పెగాసెస్, పారమౌంట్, ఎయిర్ కార్నివాల్ వంటి రీజినల్ ఎయిర్లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్ కూడా అదే బాట పట్టింది.
This post was last modified on February 17, 2022 3:15 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…