Movie News

దివాళా తీసిన రాంచ‌ర‌ణ్ కంపెనీ

సినీన‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ్ కు చెందిన విమాన‌యాన కంపెనీ స‌మ‌స్య‌ల్లో ఉందా? ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్న హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్‌‌‌‌లను ఆపేసిన నేప‌థ్యంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. కంపెనీ సీఈఓ, సీఎఫ్‌‌‌‌ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేసేయ‌డంతో కంపెనీలో ఏం జ‌రుగుతోంది అనే టాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. రామ్‌‌‌‌చరణ్‌‌‌‌కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌‌‌‌గా ఆయన పనిచేస్తున్నారు.

ట్రూజెట్‌‌‌‌ 2015, జులైలో తన సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ట్రూజెట్‌‌‌‌లో మేఘా ఇంజినీరింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు 90 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో వాటాలున్న రామ్‌‌‌‌చరణ్‌‌‌‌కు ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌‌‌‌గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్‌‌‌‌తో కంపెనీ పుంజుకుంటుందన్న స‌మ‌యంలో కరోనా వచ్చి పడింది.

మ‌రోవైపు, ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. డిమాండ్ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వానంగా తయారయ్యింది. తన సర్వీస్‌‌‌‌లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిర్‌‌‌‌‌‌‌‌ కోస్టా, ఎయిర్‌‌‌‌‌‌‌‌ పెగాసెస్‌‌‌‌, పారమౌంట్‌‌‌‌, ఎయిర్ కార్నివాల్‌‌‌‌ వంటి రీజినల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్‌‌‌‌ కూడా అదే బాట పట్టింది.

This post was last modified on February 17, 2022 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

3 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

3 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

4 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

4 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

5 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

7 hours ago