సినీనటుడు రాంచరణ్ తేజ్ కు చెందిన విమానయాన కంపెనీ సమస్యల్లో ఉందా? ఆయన చైర్మన్గా ఉన్న హైదరాబాద్కు చెందిన ఎయిర్లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్లను ఆపేసిన నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేసేయడంతో కంపెనీలో ఏం జరుగుతోంది అనే టాక్ తెరమీదకు వచ్చింది. రామ్చరణ్కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు.
ట్రూజెట్ 2015, జులైలో తన సర్వీస్లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ట్రూజెట్లో మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 90 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో వాటాలున్న రామ్చరణ్కు ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్తో కంపెనీ పుంజుకుంటుందన్న సమయంలో కరోనా వచ్చి పడింది.
మరోవైపు, ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. డిమాండ్ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్మెంట్ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వానంగా తయారయ్యింది. తన సర్వీస్లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిర్ కోస్టా, ఎయిర్ పెగాసెస్, పారమౌంట్, ఎయిర్ కార్నివాల్ వంటి రీజినల్ ఎయిర్లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్ కూడా అదే బాట పట్టింది.
This post was last modified on February 17, 2022 3:15 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…