Movie News

దివాళా తీసిన రాంచ‌ర‌ణ్ కంపెనీ

సినీన‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ్ కు చెందిన విమాన‌యాన కంపెనీ స‌మ‌స్య‌ల్లో ఉందా? ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్న హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్‌‌‌‌లను ఆపేసిన నేప‌థ్యంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. కంపెనీ సీఈఓ, సీఎఫ్‌‌‌‌ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేసేయ‌డంతో కంపెనీలో ఏం జ‌రుగుతోంది అనే టాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. రామ్‌‌‌‌చరణ్‌‌‌‌కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌‌‌‌గా ఆయన పనిచేస్తున్నారు.

ట్రూజెట్‌‌‌‌ 2015, జులైలో తన సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ట్రూజెట్‌‌‌‌లో మేఘా ఇంజినీరింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు 90 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో వాటాలున్న రామ్‌‌‌‌చరణ్‌‌‌‌కు ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌‌‌‌గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్‌‌‌‌తో కంపెనీ పుంజుకుంటుందన్న స‌మ‌యంలో కరోనా వచ్చి పడింది.

మ‌రోవైపు, ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. డిమాండ్ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వానంగా తయారయ్యింది. తన సర్వీస్‌‌‌‌లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిర్‌‌‌‌‌‌‌‌ కోస్టా, ఎయిర్‌‌‌‌‌‌‌‌ పెగాసెస్‌‌‌‌, పారమౌంట్‌‌‌‌, ఎయిర్ కార్నివాల్‌‌‌‌ వంటి రీజినల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్‌‌‌‌ కూడా అదే బాట పట్టింది.

This post was last modified on February 17, 2022 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

1 hour ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago