కమర్షియల్ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన అమలాపాల్కి వెంటవెంటనే అవకాశాలు బాగానే వచ్చాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడీ కట్టే చాన్సులు దక్కాయి. కానీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్పై ఎక్కువ దృష్టి పెట్టడం, ఆ తర్వాత కొన్ని సమస్యలు చుట్టుముట్టడం వంటి వాటి వల్ల కెరీర్ కాస్త డల్లయ్యింది. అయితే ‘ఆమె’ చిత్రంతో మళ్లీ స్పీడు పెంచింది అమల.
గ్లామరస్ పాత్రలు చేసినా.. చాలావరకు హోమ్లీ లుక్లోనే మెప్పించింది అమల. అలాంటిది ‘ఆమె’ సినిమాలో న్యూడ్గా కనిపించేసరికి జనాలు అవాక్కైపోయారు. ఒకటో రెండో సీన్స్ కాదు.. సినిమాలో మేజర్ పోర్షన్ అంతా ఆమె బట్టలు లేకుండానే ఉంటుంది. దాంతో ఆమె గట్స్కి హ్యాట్సాఫ్ చెప్పక తప్పలేదు. పోయినేడు వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలో కూడా కాస్త హాట్ రోల్లోనే కనిపించిందామె.
కానీ ఇప్పుడు ఓ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పాత్ర చేయడానికి ఓకే చెప్పింది. ఫహాద్ ఫాజిల్, సాయిపల్లవి జంటగా ‘అథిరన్’ మూవీ తీసిన వివేక్ డైరెక్షన్లో ‘టీచర్’ అనే మూవీకి ఓకే చెప్పింది అమల. ఈ సినిమా నిన్న కేరళలో ప్రారంభమయ్యింది. మాతృభాష కావడంతో తమిళ, తెలుగు చిత్రాలతో పాటు మాలీవుడ్ మూవీస్ కూడా తరచుగా చేస్తుంటుంది అమల. త్వరలో ఆమె నటించిన ‘ఆడుజీవితం’ సినిమా కూడా రిలీజ్ కూడా కాబోతోంది. ఇంతలోనే మరొకటి పట్టాలెక్కింది.
అటు తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది అమల. వాటిలో ఒకదాన్ని ప్రొడ్యూస్ కూడా చేస్తోంది. రెండూ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరి తమిళ, మలయాళ బాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న అమల.. తెలుగులో ఎందుకు నటించడానికి ఎందుకు ఆసక్తి చూపించడం లేదంటూ కొందరు ఆరాలు తీస్తున్నారు. ఆమధ్య నాగార్జునతో ప్రవీణ్ సత్తారు తీస్తున్న ‘ద ఘోస్ట్’లో నటించమని అడిగితే.. భారీ రెమ్యునరేషన్ అడిగి భయపెట్టిందన్నారు. అది నిజమో కాదో తెలీదు కానీ.. నానితో ‘జెండాపై కపిరాజు’లో నటించాక ఇంతవరకు మరో హీరో సరసన ఆమె కనిపించలేదనేది మాత్రం వాస్తవం.
This post was last modified on February 17, 2022 8:19 am
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…