సంస్కృతుల సంగతి ఎలా ఉన్నప్పటికీ సినిమాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి ఒకేలా ఉండేది ఒకప్పుడు. ఒక సినిమా ఆడితే అన్నిచోట్లా బాగా ఆడేది. పోతే అన్ని చోట్లా పోయేది. ఒక ప్రాంతంలో బాగా ఆడి.. ఇంకో చోట తేడా కొట్టడం ఎప్పుడో కానీ జరిగేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు కొంత మారాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. ఇంతకుముందులా గోదావరి భాష,యాసలో సినిమాలు తగ్గిపోయింది.
అదే సమయంలో హైదరాబాద్ అర్బన్ స్లాంగ్లో సినిమాల సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలు ఇక్కడ చాలా బాగా ఆడుతున్నాయి. ఆంధ్రాలో వాటికి ఆదరణ అనుకున్నంత స్థాయిలో లేదు. పక్కా ఆంధ్రా స్లాంగ్లో సినిమాలు తీస్తే అవి ఏపీలో బాగా ఆడి.. తెలంగాణలో ఆదరణ తగ్గుతుండటమూ జరుగుతోంది. కొత్త ఏడాదిలో రెండు రకాల ఉదాహరణలూ చూడొచ్చు.
సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ సినిమా పూర్తిగా గోదావరి జిల్లాల కల్చర్లో నడుస్తుంది. ఆ సినిమాకు ఆంధ్రాలో అంచనాలను మించి వసూళ్లు వచ్చాయి. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువున్నా సరే.. ఆ చిత్రం లాభాలు తెచ్చుకుంది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా ఏపీలో హౌస్ ఫుల్ వసూళ్లతో నడిచింది. రెండో వారం కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్గా ఆ సినిమా హిట్ స్టేటస్ అందుకుంది. ఐతే తెలంగాణలో ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది. ఆరంభం నుంచి వసూళ్ల ఆశించిన స్థాయిలో లేవు.
ఇక్కడ దాన్ని ఫెయిల్యూర్గానే చెప్పాలి. ఐతే తాజాగా రిలీజైన ‘డీజే టిల్లు’ విషయానికి వస్తే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రానికి తెలంగాణలో వసూళ్లు అసాధారణంగా ఉన్నాయి. సినిమా ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వీకెండ్ అంతా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. వీక్ డేస్లోనూ స్ట్రాంగ్గానే నిలుస్తోంది. ఆంధ్రాలో మాత్రం ఈ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు లేవు. అక్కడ సినిమా ఫెయిల్యూర్ అనలేం. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. కానీ పక్కా తెలంగాణ యాస, కల్చర్లో సాగే సినిమాకు తెలంగాణలో ఉన్నంత రెస్పాన్స్ అయితే ఆంధ్రాలో కనిపించడం లేదు. అక్కడ ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది ‘డీజే టిల్లు’.
This post was last modified on February 15, 2022 7:48 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…