సంస్కృతుల సంగతి ఎలా ఉన్నప్పటికీ సినిమాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి ఒకేలా ఉండేది ఒకప్పుడు. ఒక సినిమా ఆడితే అన్నిచోట్లా బాగా ఆడేది. పోతే అన్ని చోట్లా పోయేది. ఒక ప్రాంతంలో బాగా ఆడి.. ఇంకో చోట తేడా కొట్టడం ఎప్పుడో కానీ జరిగేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు కొంత మారాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. ఇంతకుముందులా గోదావరి భాష,యాసలో సినిమాలు తగ్గిపోయింది.
అదే సమయంలో హైదరాబాద్ అర్బన్ స్లాంగ్లో సినిమాల సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలు ఇక్కడ చాలా బాగా ఆడుతున్నాయి. ఆంధ్రాలో వాటికి ఆదరణ అనుకున్నంత స్థాయిలో లేదు. పక్కా ఆంధ్రా స్లాంగ్లో సినిమాలు తీస్తే అవి ఏపీలో బాగా ఆడి.. తెలంగాణలో ఆదరణ తగ్గుతుండటమూ జరుగుతోంది. కొత్త ఏడాదిలో రెండు రకాల ఉదాహరణలూ చూడొచ్చు.
సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ సినిమా పూర్తిగా గోదావరి జిల్లాల కల్చర్లో నడుస్తుంది. ఆ సినిమాకు ఆంధ్రాలో అంచనాలను మించి వసూళ్లు వచ్చాయి. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువున్నా సరే.. ఆ చిత్రం లాభాలు తెచ్చుకుంది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా ఏపీలో హౌస్ ఫుల్ వసూళ్లతో నడిచింది. రెండో వారం కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్గా ఆ సినిమా హిట్ స్టేటస్ అందుకుంది. ఐతే తెలంగాణలో ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది. ఆరంభం నుంచి వసూళ్ల ఆశించిన స్థాయిలో లేవు.
ఇక్కడ దాన్ని ఫెయిల్యూర్గానే చెప్పాలి. ఐతే తాజాగా రిలీజైన ‘డీజే టిల్లు’ విషయానికి వస్తే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రానికి తెలంగాణలో వసూళ్లు అసాధారణంగా ఉన్నాయి. సినిమా ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వీకెండ్ అంతా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. వీక్ డేస్లోనూ స్ట్రాంగ్గానే నిలుస్తోంది. ఆంధ్రాలో మాత్రం ఈ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు లేవు. అక్కడ సినిమా ఫెయిల్యూర్ అనలేం. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. కానీ పక్కా తెలంగాణ యాస, కల్చర్లో సాగే సినిమాకు తెలంగాణలో ఉన్నంత రెస్పాన్స్ అయితే ఆంధ్రాలో కనిపించడం లేదు. అక్కడ ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది ‘డీజే టిల్లు’.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…