వెరైటీ కథలతో మెప్పించే కార్తి.. ‘ఖైదీ’ సినిమాతో మరింత వైవిధ్యతను చూపించాడు. హీరోయిన్ ఉండదు. రొమాన్స్ లేదు. పాటలు అంతకన్నా లేవు. రొటీన్ ఫార్మాట్కి పూర్తి భిన్నంగా ఉండే కాన్సెప్ట్. ఒకే ఒక్క రాత్రిలో కథంతా జరుగుతుంది. పైగా అతను సినిమా అంతా ఒకే డ్రెస్తో ఉంటాడు. ఇలాంటి సినిమా చేయడం నిజంగా సాహసమే. అయినా కూడా వహ్వా అనిపించాడు కార్తి.
తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని కట్టి పడేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి హిట్టు కొట్టాడు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యి సరిగ్గా సెట్స్కి వెళ్లే సమయానికి ఓ సమస్య వచ్చింది. ‘ఖైదీ’ కథ తనదంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు.
తమిళనాడులో ఉన్న ఒక జైలులోని ఖైదీ జీవితం ఆధారంగా తాను ఈ కథ రాసుకున్నానని, 2007లో నిర్మాత ఎస్ఆర్ ప్రభుతో చెబితే సినిమా తీద్దామని చెప్పి తనకి పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని రాజీవ్ రంజన్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. ఇప్పుడు తన అనుమతి లేకుండా సినిమా ఎలా తీసేస్తారని, లాభాల్లో తనకి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దానికి ప్రభు వెంటనే రియాక్టయ్యాడు. అవన్నీ అబద్ధాలని, విషయం తాను కోర్టులోనే తేల్చుకుంటానని చాలెంజ్ చేశాడు. ఇప్పుడా చాలెంజ్లో తను నెగ్గాడు. ఇది లోకేష్ రాసుకున్న సొంత కథేనని ప్రూవ్ కావడంతో కోర్లు కేసును కొట్టేసింది. దాంతో అతి త్వరలో మూవీని సెట్స్కి తీసుకెళ్లబోతున్నారు. మరోవైపు ‘ఖైదీ’ హిందీ రీమేక్ షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. కార్తి పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు.
This post was last modified on February 14, 2022 4:50 pm
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…