హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 90వ దశకం వరకు ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు.. 2000 తర్వాత జోరు కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులు ఆయన్ని వెనక్కి లాగాయి. మార్కెట్ దెబ్బ తినేసి సినిమాలు తగ్గించేశారు. సొంత బేనర్లోనూ సినిమాలు చేయడం తగ్గిపోయింది. బయట కూడా సినిమాలు పెద్దగా ఒప్పుకోలేదు. కానీ పూర్తిగా అయితే సినిమాలకు టాటా చెప్పలేదు.
అప్పుడప్పుడూ ఒక సినిమాతో పలకరిస్తున్నారు. కానీ సరైన ఫలితం మాత్రం దక్కట్లేదు. చివరగా సొంత బేనర్లో లీడ్ రోల్లో గాయత్రి అనే సినిమా చేశారు. అది దారుణమైన ఫలితమందుకుంది. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం పాటు వార్తల్లో లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి విడుదలకు సిద్ధం చేశారు. దీనికి ఆశించినంత హైప్ అయితే కనిపించడం లేదు.
సన్ ఆఫ్ ఇండియా హిట్టయితే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. స్వయంగా మోహన్ బాబుకు కూడా ఈ సినిమా మీద నమ్మకం లేదా అనిపిస్తోంది ఆయన మాటలు చూస్తుంటే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. రిజల్ట్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది చెడ్డ సినిమా కాదు.
ఈ చిత్రం సక్సెస్ అవుతుందా లేదా అనేది చెప్పలేకపోవచ్చు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి చిత్రమని ఫీలవుతారు. గత సినిమాల అనుభవాల కారణంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఘంటాపథంగా చెప్పను. కానీ మోహన్ బాబు మంచి సినిమా చేశారు అని అందరూ అనుకుంటారు. సక్సెస్ అయితే మంచి సక్సెస్ అవుతుంది. లేదంటే లేదు. దానికీ సిద్ధమయ్యా అని మోహన్ బాబు పేర్కొనడం గమనార్హం. ఆయన మాటల్ని బట్టి చూస్తే సన్ ఆఫ్ ఇండియాకు మంచి సినిమా అని పేరొచ్చినా బాక్సాఫీస్ సక్సెస్ కాదేమో అన్న అనుమానంతో ఉన్నట్లే ఉన్నారు.
This post was last modified on February 14, 2022 1:52 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…