హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 90వ దశకం వరకు ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు.. 2000 తర్వాత జోరు కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులు ఆయన్ని వెనక్కి లాగాయి. మార్కెట్ దెబ్బ తినేసి సినిమాలు తగ్గించేశారు. సొంత బేనర్లోనూ సినిమాలు చేయడం తగ్గిపోయింది. బయట కూడా సినిమాలు పెద్దగా ఒప్పుకోలేదు. కానీ పూర్తిగా అయితే సినిమాలకు టాటా చెప్పలేదు.
అప్పుడప్పుడూ ఒక సినిమాతో పలకరిస్తున్నారు. కానీ సరైన ఫలితం మాత్రం దక్కట్లేదు. చివరగా సొంత బేనర్లో లీడ్ రోల్లో గాయత్రి అనే సినిమా చేశారు. అది దారుణమైన ఫలితమందుకుంది. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం పాటు వార్తల్లో లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి విడుదలకు సిద్ధం చేశారు. దీనికి ఆశించినంత హైప్ అయితే కనిపించడం లేదు.
సన్ ఆఫ్ ఇండియా హిట్టయితే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. స్వయంగా మోహన్ బాబుకు కూడా ఈ సినిమా మీద నమ్మకం లేదా అనిపిస్తోంది ఆయన మాటలు చూస్తుంటే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. రిజల్ట్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది చెడ్డ సినిమా కాదు.
ఈ చిత్రం సక్సెస్ అవుతుందా లేదా అనేది చెప్పలేకపోవచ్చు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి చిత్రమని ఫీలవుతారు. గత సినిమాల అనుభవాల కారణంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఘంటాపథంగా చెప్పను. కానీ మోహన్ బాబు మంచి సినిమా చేశారు అని అందరూ అనుకుంటారు. సక్సెస్ అయితే మంచి సక్సెస్ అవుతుంది. లేదంటే లేదు. దానికీ సిద్ధమయ్యా అని మోహన్ బాబు పేర్కొనడం గమనార్హం. ఆయన మాటల్ని బట్టి చూస్తే సన్ ఆఫ్ ఇండియాకు మంచి సినిమా అని పేరొచ్చినా బాక్సాఫీస్ సక్సెస్ కాదేమో అన్న అనుమానంతో ఉన్నట్లే ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…