టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డీప్గా హర్టయ్యాడు. తాను ఎంతో కష్టపడి, ఇష్టపడి కంపోజ్ చేసిన పాట.. అధికారికంగా రిలీజ్ కావడానికి కావడానికి ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడమే అందుక్కారణం. ఆ పాట మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనిది కావడం గమనార్హం. ఈ సినిమా నుంచి కళావతి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను ప్రేమికుల దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీని ప్రోమో కూడా వచ్చింది. అందులో విజువల్స్ చాలా ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలున్న సినిమా నుంచి వస్తున్న తొలి పాట కావడంతో కళావతిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఐతే చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను రూపొందించడానికి ఒక వ్యక్తికి పని అప్పగిస్తే.. అతనే ఈ పాటను ఆన్ లైన్లో లీక్ చేసేయడంతో షాకవడం టీం వంతయింది.
ఈ విషయంలో మిగతా అందరి కంటే తమన్ ఎక్కువ హర్టయినట్లున్నాడు. అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో మెసేజ్లు రిలీజ్ చేశాడు. ట్విట్టర్లో వాటిని పోస్ట్ చేశాడు. ఒక పాట కోసం సంగీత దర్శకులుగా తాము ఎంత కష్టపడతామో.. దాని కోసం చిత్ర బృందంలో మిగతా వాళ్లు ఎంత శ్రమిస్తారో.. ఎంతెంత డబ్బు ఖర్చవుతుందో తమన్ వివరిస్తూ తన బాధను పంచుకున్నాడు.
ఇంత కష్టపడి అభిమానుల కోసం పాటను సిద్ధం చేసి వారితో ఎప్పుడెప్పుడు పంచుకుందామా అని తాము చూస్తుంటే.. తాము పని అప్పగించిన వ్యక్తే ఇలా పాటను లీక్ చేసేయడం ఎంత దారుణం అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తట్టుకోలేని బాధను కలిగిస్తోందని చెప్పాడు. ఐతే ఇకపై తాము మరింత జాగ్రత్తగా ఉంటామని.. అభిమానుల కోసం మరింత కష్టపడి పని చేస్తామని తమన్ తెలిపాడు. ఆన్ లైన్లోకి వచ్చిన కళావతి లిరికల్ వీడియోను చిత్ర బృందం తొలగించే పనిలో పడింది.
This post was last modified on February 13, 2022 12:39 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…