టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డీప్గా హర్టయ్యాడు. తాను ఎంతో కష్టపడి, ఇష్టపడి కంపోజ్ చేసిన పాట.. అధికారికంగా రిలీజ్ కావడానికి కావడానికి ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడమే అందుక్కారణం. ఆ పాట మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనిది కావడం గమనార్హం. ఈ సినిమా నుంచి కళావతి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను ప్రేమికుల దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీని ప్రోమో కూడా వచ్చింది. అందులో విజువల్స్ చాలా ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలున్న సినిమా నుంచి వస్తున్న తొలి పాట కావడంతో కళావతిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఐతే చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను రూపొందించడానికి ఒక వ్యక్తికి పని అప్పగిస్తే.. అతనే ఈ పాటను ఆన్ లైన్లో లీక్ చేసేయడంతో షాకవడం టీం వంతయింది.
ఈ విషయంలో మిగతా అందరి కంటే తమన్ ఎక్కువ హర్టయినట్లున్నాడు. అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో మెసేజ్లు రిలీజ్ చేశాడు. ట్విట్టర్లో వాటిని పోస్ట్ చేశాడు. ఒక పాట కోసం సంగీత దర్శకులుగా తాము ఎంత కష్టపడతామో.. దాని కోసం చిత్ర బృందంలో మిగతా వాళ్లు ఎంత శ్రమిస్తారో.. ఎంతెంత డబ్బు ఖర్చవుతుందో తమన్ వివరిస్తూ తన బాధను పంచుకున్నాడు.
ఇంత కష్టపడి అభిమానుల కోసం పాటను సిద్ధం చేసి వారితో ఎప్పుడెప్పుడు పంచుకుందామా అని తాము చూస్తుంటే.. తాము పని అప్పగించిన వ్యక్తే ఇలా పాటను లీక్ చేసేయడం ఎంత దారుణం అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తట్టుకోలేని బాధను కలిగిస్తోందని చెప్పాడు. ఐతే ఇకపై తాము మరింత జాగ్రత్తగా ఉంటామని.. అభిమానుల కోసం మరింత కష్టపడి పని చేస్తామని తమన్ తెలిపాడు. ఆన్ లైన్లోకి వచ్చిన కళావతి లిరికల్ వీడియోను చిత్ర బృందం తొలగించే పనిలో పడింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…