టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డీప్గా హర్టయ్యాడు. తాను ఎంతో కష్టపడి, ఇష్టపడి కంపోజ్ చేసిన పాట.. అధికారికంగా రిలీజ్ కావడానికి కావడానికి ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడమే అందుక్కారణం. ఆ పాట మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనిది కావడం గమనార్హం. ఈ సినిమా నుంచి కళావతి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను ప్రేమికుల దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీని ప్రోమో కూడా వచ్చింది. అందులో విజువల్స్ చాలా ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలున్న సినిమా నుంచి వస్తున్న తొలి పాట కావడంతో కళావతిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఐతే చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను రూపొందించడానికి ఒక వ్యక్తికి పని అప్పగిస్తే.. అతనే ఈ పాటను ఆన్ లైన్లో లీక్ చేసేయడంతో షాకవడం టీం వంతయింది.
ఈ విషయంలో మిగతా అందరి కంటే తమన్ ఎక్కువ హర్టయినట్లున్నాడు. అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో మెసేజ్లు రిలీజ్ చేశాడు. ట్విట్టర్లో వాటిని పోస్ట్ చేశాడు. ఒక పాట కోసం సంగీత దర్శకులుగా తాము ఎంత కష్టపడతామో.. దాని కోసం చిత్ర బృందంలో మిగతా వాళ్లు ఎంత శ్రమిస్తారో.. ఎంతెంత డబ్బు ఖర్చవుతుందో తమన్ వివరిస్తూ తన బాధను పంచుకున్నాడు.
ఇంత కష్టపడి అభిమానుల కోసం పాటను సిద్ధం చేసి వారితో ఎప్పుడెప్పుడు పంచుకుందామా అని తాము చూస్తుంటే.. తాము పని అప్పగించిన వ్యక్తే ఇలా పాటను లీక్ చేసేయడం ఎంత దారుణం అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తట్టుకోలేని బాధను కలిగిస్తోందని చెప్పాడు. ఐతే ఇకపై తాము మరింత జాగ్రత్తగా ఉంటామని.. అభిమానుల కోసం మరింత కష్టపడి పని చేస్తామని తమన్ తెలిపాడు. ఆన్ లైన్లోకి వచ్చిన కళావతి లిరికల్ వీడియోను చిత్ర బృందం తొలగించే పనిలో పడింది.
This post was last modified on February 13, 2022 12:39 pm
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…