కొన్ని వారాలుగా ఇటు థియేటర్లలో.. అటు ఓటీటీల్లో సరైన సినిమాలు లేక డీలా పడ్డ ప్రేక్షకులకు ఈ వారం పండుగ అన్నట్లే ఉంది. వివిధ భాషల్లో అరడజనుకు పైగా కొత్త సినిమాలు ఈ వీకెండ్లో ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల సందడి అయితే కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లలోకి ఈ వారం నాలుగు కొత్త సినిమాలు దిగగా.. ఓటీటీల ద్వారా మూడు చిత్రాలు రిలీజయ్యాయి.
గురు, శుక్రవారాల్లో మాత్రమే ఆరు సినిమాలు రిలీజవడం విశేషం. ఐతే వీటిలో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా మాత్రం ఏదీ లేదు. ఈ వీకెండ్లో ఎక్కువ అంచనాలున్నది ‘ఖిలాడి’ మీదే. మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ తర్వాత వచ్చిన సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు దూరంలో ఆగిపోయింది. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్కు ఢోకా లేకపోయినా.. సినిమా నిలబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
తొలి రోజు సెకండ్ షోలకే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.ఇక శుక్రవారం థియేటర్లలోకి దిగిన ఎఫ్ఐఆర్, సెహరి సినిమాలకు ఆశించిన స్పందన లేదు. ‘ఎఫ్ఐఆర్’ మంచి సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులకు అది అంతగా పట్టట్లేదు. మరీ సీరియస్ సినిమా కావడం, విష్ణు విశాల్ సహా నటీనటులెవరు తెలిసిన వారు కాకపోవడం దీనిక ిమైనస్. ఇక ‘సెహరి’ సినిమాకు అంతగా బజ్ లేదు. సినిమా చాలా చిన్న స్థాయిలో రిలీజైంది. టాక్ యావరేజ్ అంటున్నారు. ఇక ఓటీటీల ద్వారా విడుదలైన మహాన్, భామాకలాపం అంచనాలను అందుకోలేకపోయాయి. వీటికి మిశ్రమ స్పందన వస్తోంది. సుమంత్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’కి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.
ఇలా అరడజను సినిమాల్లో ఏదీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక ఈ వారానికి మిగిలింది ‘డీజే టిల్లు’నే. ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక అనూహ్యమైన హైప్ వచ్చింది. రిలీజ్ టైంకి అది ఇంకా పెరిగింది. ఈ వారం మిగతా సినిమాలు నిరాశ పరచడంతో ‘డీజే టిల్లు’కు హైప్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యకర రీతిలో జరిగాయి. సినిమా తొలి రోజు హౌస్ ఫుల్స్తో నడవబోతోంది. మంచి టాక్ వస్తే టిల్లు గాడు వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 12, 2022 10:36 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…