కొన్ని వారాలుగా ఇటు థియేటర్లలో.. అటు ఓటీటీల్లో సరైన సినిమాలు లేక డీలా పడ్డ ప్రేక్షకులకు ఈ వారం పండుగ అన్నట్లే ఉంది. వివిధ భాషల్లో అరడజనుకు పైగా కొత్త సినిమాలు ఈ వీకెండ్లో ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల సందడి అయితే కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లలోకి ఈ వారం నాలుగు కొత్త సినిమాలు దిగగా.. ఓటీటీల ద్వారా మూడు చిత్రాలు రిలీజయ్యాయి.
గురు, శుక్రవారాల్లో మాత్రమే ఆరు సినిమాలు రిలీజవడం విశేషం. ఐతే వీటిలో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా మాత్రం ఏదీ లేదు. ఈ వీకెండ్లో ఎక్కువ అంచనాలున్నది ‘ఖిలాడి’ మీదే. మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ తర్వాత వచ్చిన సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు దూరంలో ఆగిపోయింది. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్కు ఢోకా లేకపోయినా.. సినిమా నిలబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
తొలి రోజు సెకండ్ షోలకే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.ఇక శుక్రవారం థియేటర్లలోకి దిగిన ఎఫ్ఐఆర్, సెహరి సినిమాలకు ఆశించిన స్పందన లేదు. ‘ఎఫ్ఐఆర్’ మంచి సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులకు అది అంతగా పట్టట్లేదు. మరీ సీరియస్ సినిమా కావడం, విష్ణు విశాల్ సహా నటీనటులెవరు తెలిసిన వారు కాకపోవడం దీనిక ిమైనస్. ఇక ‘సెహరి’ సినిమాకు అంతగా బజ్ లేదు. సినిమా చాలా చిన్న స్థాయిలో రిలీజైంది. టాక్ యావరేజ్ అంటున్నారు. ఇక ఓటీటీల ద్వారా విడుదలైన మహాన్, భామాకలాపం అంచనాలను అందుకోలేకపోయాయి. వీటికి మిశ్రమ స్పందన వస్తోంది. సుమంత్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’కి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.
ఇలా అరడజను సినిమాల్లో ఏదీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక ఈ వారానికి మిగిలింది ‘డీజే టిల్లు’నే. ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక అనూహ్యమైన హైప్ వచ్చింది. రిలీజ్ టైంకి అది ఇంకా పెరిగింది. ఈ వారం మిగతా సినిమాలు నిరాశ పరచడంతో ‘డీజే టిల్లు’కు హైప్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యకర రీతిలో జరిగాయి. సినిమా తొలి రోజు హౌస్ ఫుల్స్తో నడవబోతోంది. మంచి టాక్ వస్తే టిల్లు గాడు వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 12, 2022 10:36 am
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…