కొన్ని వారాలుగా ఇటు థియేటర్లలో.. అటు ఓటీటీల్లో సరైన సినిమాలు లేక డీలా పడ్డ ప్రేక్షకులకు ఈ వారం పండుగ అన్నట్లే ఉంది. వివిధ భాషల్లో అరడజనుకు పైగా కొత్త సినిమాలు ఈ వీకెండ్లో ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల సందడి అయితే కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లలోకి ఈ వారం నాలుగు కొత్త సినిమాలు దిగగా.. ఓటీటీల ద్వారా మూడు చిత్రాలు రిలీజయ్యాయి.
గురు, శుక్రవారాల్లో మాత్రమే ఆరు సినిమాలు రిలీజవడం విశేషం. ఐతే వీటిలో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా మాత్రం ఏదీ లేదు. ఈ వీకెండ్లో ఎక్కువ అంచనాలున్నది ‘ఖిలాడి’ మీదే. మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ తర్వాత వచ్చిన సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు దూరంలో ఆగిపోయింది. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్కు ఢోకా లేకపోయినా.. సినిమా నిలబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
తొలి రోజు సెకండ్ షోలకే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.ఇక శుక్రవారం థియేటర్లలోకి దిగిన ఎఫ్ఐఆర్, సెహరి సినిమాలకు ఆశించిన స్పందన లేదు. ‘ఎఫ్ఐఆర్’ మంచి సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులకు అది అంతగా పట్టట్లేదు. మరీ సీరియస్ సినిమా కావడం, విష్ణు విశాల్ సహా నటీనటులెవరు తెలిసిన వారు కాకపోవడం దీనిక ిమైనస్. ఇక ‘సెహరి’ సినిమాకు అంతగా బజ్ లేదు. సినిమా చాలా చిన్న స్థాయిలో రిలీజైంది. టాక్ యావరేజ్ అంటున్నారు. ఇక ఓటీటీల ద్వారా విడుదలైన మహాన్, భామాకలాపం అంచనాలను అందుకోలేకపోయాయి. వీటికి మిశ్రమ స్పందన వస్తోంది. సుమంత్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’కి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.
ఇలా అరడజను సినిమాల్లో ఏదీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక ఈ వారానికి మిగిలింది ‘డీజే టిల్లు’నే. ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక అనూహ్యమైన హైప్ వచ్చింది. రిలీజ్ టైంకి అది ఇంకా పెరిగింది. ఈ వారం మిగతా సినిమాలు నిరాశ పరచడంతో ‘డీజే టిల్లు’కు హైప్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యకర రీతిలో జరిగాయి. సినిమా తొలి రోజు హౌస్ ఫుల్స్తో నడవబోతోంది. మంచి టాక్ వస్తే టిల్లు గాడు వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 12, 2022 10:36 am
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…