కొన్ని వారాలుగా ఇటు థియేటర్లలో.. అటు ఓటీటీల్లో సరైన సినిమాలు లేక డీలా పడ్డ ప్రేక్షకులకు ఈ వారం పండుగ అన్నట్లే ఉంది. వివిధ భాషల్లో అరడజనుకు పైగా కొత్త సినిమాలు ఈ వీకెండ్లో ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల సందడి అయితే కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లలోకి ఈ వారం నాలుగు కొత్త సినిమాలు దిగగా.. ఓటీటీల ద్వారా మూడు చిత్రాలు రిలీజయ్యాయి.
గురు, శుక్రవారాల్లో మాత్రమే ఆరు సినిమాలు రిలీజవడం విశేషం. ఐతే వీటిలో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా మాత్రం ఏదీ లేదు. ఈ వీకెండ్లో ఎక్కువ అంచనాలున్నది ‘ఖిలాడి’ మీదే. మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ తర్వాత వచ్చిన సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు దూరంలో ఆగిపోయింది. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్కు ఢోకా లేకపోయినా.. సినిమా నిలబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
తొలి రోజు సెకండ్ షోలకే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.ఇక శుక్రవారం థియేటర్లలోకి దిగిన ఎఫ్ఐఆర్, సెహరి సినిమాలకు ఆశించిన స్పందన లేదు. ‘ఎఫ్ఐఆర్’ మంచి సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులకు అది అంతగా పట్టట్లేదు. మరీ సీరియస్ సినిమా కావడం, విష్ణు విశాల్ సహా నటీనటులెవరు తెలిసిన వారు కాకపోవడం దీనిక ిమైనస్. ఇక ‘సెహరి’ సినిమాకు అంతగా బజ్ లేదు. సినిమా చాలా చిన్న స్థాయిలో రిలీజైంది. టాక్ యావరేజ్ అంటున్నారు. ఇక ఓటీటీల ద్వారా విడుదలైన మహాన్, భామాకలాపం అంచనాలను అందుకోలేకపోయాయి. వీటికి మిశ్రమ స్పందన వస్తోంది. సుమంత్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’కి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.
ఇలా అరడజను సినిమాల్లో ఏదీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక ఈ వారానికి మిగిలింది ‘డీజే టిల్లు’నే. ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక అనూహ్యమైన హైప్ వచ్చింది. రిలీజ్ టైంకి అది ఇంకా పెరిగింది. ఈ వారం మిగతా సినిమాలు నిరాశ పరచడంతో ‘డీజే టిల్లు’కు హైప్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యకర రీతిలో జరిగాయి. సినిమా తొలి రోజు హౌస్ ఫుల్స్తో నడవబోతోంది. మంచి టాక్ వస్తే టిల్లు గాడు వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 12, 2022 10:36 am
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…