ఒకప్పుడు సౌత్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిన రేవతి.. మొన్నమొన్నటి వరకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజోల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. సూరజ్ సింగ్, శ్రద్ధ అగర్వాల్, వర్ష కుక్రేజీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ను ఇవాళ ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితం ‘ద లాస్ట్ హుర్రే’ పేరుతో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ‘సలామ్ వెంకీ’గా మార్చారు. ఇదొక తల్లి కథ. ఆమె జీవితంలో అనుకోకుండా చాలా సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొని చివరికి విజయం ఎలా సాధించిందనేది థీమ్. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నారు రేవతి.
పెళ్లి తర్వాత హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తల్లీబిడ్డల చుట్టూ తిరిగే హెలికాప్టర్ ఈలా, త్రిభంగా చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్నే ఎంచుకుంది. కాకపోతే రేవతి డైరెక్ట్ చేస్తూ ఉండటంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
మిత్ర్ మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే చిత్రాలతో అద్భుతమైన డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు రేవతి. ‘మిత్ర్’ చిత్రానికైతే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాజోల్ కూడా మంచి నటి కాబట్టి వీరి కాంబినేషన్లో ఎక్సెలెంట్ సినిమా వస్తుందని అంచనా వేస్తున్నారంతా.
This post was last modified on February 11, 2022 11:16 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…