ఒకప్పుడు సౌత్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిన రేవతి.. మొన్నమొన్నటి వరకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజోల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. సూరజ్ సింగ్, శ్రద్ధ అగర్వాల్, వర్ష కుక్రేజీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ను ఇవాళ ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితం ‘ద లాస్ట్ హుర్రే’ పేరుతో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ‘సలామ్ వెంకీ’గా మార్చారు. ఇదొక తల్లి కథ. ఆమె జీవితంలో అనుకోకుండా చాలా సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొని చివరికి విజయం ఎలా సాధించిందనేది థీమ్. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నారు రేవతి.
పెళ్లి తర్వాత హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తల్లీబిడ్డల చుట్టూ తిరిగే హెలికాప్టర్ ఈలా, త్రిభంగా చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్నే ఎంచుకుంది. కాకపోతే రేవతి డైరెక్ట్ చేస్తూ ఉండటంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
మిత్ర్ మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే చిత్రాలతో అద్భుతమైన డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు రేవతి. ‘మిత్ర్’ చిత్రానికైతే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాజోల్ కూడా మంచి నటి కాబట్టి వీరి కాంబినేషన్లో ఎక్సెలెంట్ సినిమా వస్తుందని అంచనా వేస్తున్నారంతా.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…