ఒకప్పుడు సౌత్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిన రేవతి.. మొన్నమొన్నటి వరకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజోల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. సూరజ్ సింగ్, శ్రద్ధ అగర్వాల్, వర్ష కుక్రేజీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ను ఇవాళ ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితం ‘ద లాస్ట్ హుర్రే’ పేరుతో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ‘సలామ్ వెంకీ’గా మార్చారు. ఇదొక తల్లి కథ. ఆమె జీవితంలో అనుకోకుండా చాలా సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొని చివరికి విజయం ఎలా సాధించిందనేది థీమ్. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నారు రేవతి.
పెళ్లి తర్వాత హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తల్లీబిడ్డల చుట్టూ తిరిగే హెలికాప్టర్ ఈలా, త్రిభంగా చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్నే ఎంచుకుంది. కాకపోతే రేవతి డైరెక్ట్ చేస్తూ ఉండటంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
మిత్ర్ మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే చిత్రాలతో అద్భుతమైన డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు రేవతి. ‘మిత్ర్’ చిత్రానికైతే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాజోల్ కూడా మంచి నటి కాబట్టి వీరి కాంబినేషన్లో ఎక్సెలెంట్ సినిమా వస్తుందని అంచనా వేస్తున్నారంతా.
This post was last modified on February 11, 2022 11:16 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…