కేదార్ సెలగంశెట్టి.. ఏడాది కిందట ఈ పేరు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా ఈ కొత్త నిర్మాత ఒక సెన్సేషనల్ మూవీని అనౌన్స్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఇతను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడని.. బన్నీకి ఫాల్కన్ పేరుతో లగ్జరీ కారవాన్ బహుమతిగా ఇచ్చింది అతనే అని.. అందుకు బదులుగానే తనకు సన్నిహితుడైన సుకుమార్తో సినిమా సెట్ చేశాడని అప్పట్లో టాలీవుడ్లో చర్చ నడిచింది.
ఈ నిర్మాత బేనర్ పేరు కూడా ‘ఫాల్కన్ క్రియేషన్స్’ అని పెట్టడంతో ఈ ప్రచారం నిజమే అనిపించింది. ఐతే ఘనంగా ఈ ప్రాజెక్టును ప్రకటించడం అయితే జరిగింది కానీ.. ఎంతకీ ఇది పట్టాలెక్కలేదు. ఈ సినిమా అనౌన్స్ చేసే సమయానికి ‘పుష్ప’ ఒక పార్ట్గానే రిలీజ్ కావాల్సింది. తర్వాతేమో అది రెండు భాగాలైంది. ఇప్పుడు సుక్కు రెండో పార్ట్ మీద దృష్టిపెట్టాడు.
దీని తర్వాతేమో రామ్ చరణ్తో సినిమా అంటున్నారు. విజయ్-సుక్కు కాంబినేషన్లో కేదార్ తీయాల్సిన సినిమా గురించి ఏ చర్చా లేదు. దాని గురించి అంతా మరిచిపోయారు.కట్ చేస్తే ఇప్పుడు కేదార్ సెలగంశెట్టి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అతను నిర్మాతగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. అదే.. గంగం గణేశా. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కావడం విశేషం.
వంశీ కారుమంచి అనే మరో నిర్మాతతో కలిసి చిన్న బడ్జెట్లో ఈ సినిమా చేస్తున్నాడు కేదార్. దీని కోసం వేరుగా ‘హైలైఫ్’ అనే కొత్త బేనర్ పెట్టారు. ఐతే విజయ్-సుక్కుల క్రేజీ కాంబినేషన్లో భారీ చిత్రం ప్లాన్ చేసుకుంటే.. అది కాస్తా పక్కకు వెళ్లిపోయి ఆనంద్ తమ్ముడు, ఉదయ్ శెట్టి అనే కొత్త దర్శకుడితో చిన్న సినిమా చేసుకోవాల్సి వచ్చిందేంటి అని ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. బహుశా తనతో సినిమా కార్యరూపం దాల్చనందుకు పరిహారంగా విజయే ఈ ప్రాజెక్టు సెట్ చేసి ఉండొచ్చు.
This post was last modified on February 9, 2022 10:02 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…