యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గత కొంత కాలం నుంచి హిట్టు ముఖమే చూడలేదు. `శతమానంభవతి` తర్వాత ఈయన నటించిన రాధ, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం చిత్రాలు ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే శర్వా తాజాగా నటించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.
ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని శర్వానంద్ తెగ తాపత్రాయపడుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయట.
సోషల్ మీడియాలో జోరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్ సొంతం చేసుకున్నారట. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్లను చెల్లించారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలే నిజమైతే ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్ ఇదే అవుతుంది.
This post was last modified on February 9, 2022 2:14 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…