Movie News

రికార్డు ధ‌ర‌కు `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఓటీటీ రైట్స్‌?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ గ‌త కొంత కాలం నుంచి హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. `శతమానంభవతి` త‌ర్వాత ఈయ‌న న‌టించిన రాధ, రణరంగం, జాను, శ్రీ‌కారం, మ‌హాస‌ముద్రం చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అయితే శ‌ర్వా తాజాగా న‌టించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.

ఈ సినిమాతో ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని శ‌ర్వానంద్ తెగ తాప‌త్రాయ‌ప‌డుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. ఇక‌పోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయ‌ట‌.

సోష‌ల్ మీడియాలో జోరుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ మ‌రియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్  సొంతం చేసుకున్నార‌ట‌. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్ల‌ను చెల్లించారని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు శ‌ర్వానంద్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్‌ ఇదే అవుతుంది.

This post was last modified on February 9, 2022 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

13 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

38 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

40 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago