Movie News

రికార్డు ధ‌ర‌కు `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఓటీటీ రైట్స్‌?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ గ‌త కొంత కాలం నుంచి హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. `శతమానంభవతి` త‌ర్వాత ఈయ‌న న‌టించిన రాధ, రణరంగం, జాను, శ్రీ‌కారం, మ‌హాస‌ముద్రం చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అయితే శ‌ర్వా తాజాగా న‌టించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.

ఈ సినిమాతో ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని శ‌ర్వానంద్ తెగ తాప‌త్రాయ‌ప‌డుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. ఇక‌పోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయ‌ట‌.

సోష‌ల్ మీడియాలో జోరుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ మ‌రియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్  సొంతం చేసుకున్నార‌ట‌. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్ల‌ను చెల్లించారని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు శ‌ర్వానంద్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్‌ ఇదే అవుతుంది.

This post was last modified on February 9, 2022 2:14 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

3 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

3 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

5 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

6 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

10 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

10 hours ago