Movie News

రికార్డు ధ‌ర‌కు `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఓటీటీ రైట్స్‌?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ గ‌త కొంత కాలం నుంచి హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. `శతమానంభవతి` త‌ర్వాత ఈయ‌న న‌టించిన రాధ, రణరంగం, జాను, శ్రీ‌కారం, మ‌హాస‌ముద్రం చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అయితే శ‌ర్వా తాజాగా న‌టించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.

ఈ సినిమాతో ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని శ‌ర్వానంద్ తెగ తాప‌త్రాయ‌ప‌డుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. ఇక‌పోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయ‌ట‌.

సోష‌ల్ మీడియాలో జోరుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ మ‌రియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్  సొంతం చేసుకున్నార‌ట‌. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్ల‌ను చెల్లించారని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు శ‌ర్వానంద్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్‌ ఇదే అవుతుంది.

This post was last modified on February 9, 2022 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

19 minutes ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

1 hour ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

1 hour ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

3 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

3 hours ago