యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గత కొంత కాలం నుంచి హిట్టు ముఖమే చూడలేదు. `శతమానంభవతి` తర్వాత ఈయన నటించిన రాధ, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం చిత్రాలు ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే శర్వా తాజాగా నటించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.
ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని శర్వానంద్ తెగ తాపత్రాయపడుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయట.
సోషల్ మీడియాలో జోరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్ సొంతం చేసుకున్నారట. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్లను చెల్లించారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలే నిజమైతే ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్ ఇదే అవుతుంది.
This post was last modified on February 9, 2022 2:14 pm
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…