యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గత కొంత కాలం నుంచి హిట్టు ముఖమే చూడలేదు. `శతమానంభవతి` తర్వాత ఈయన నటించిన రాధ, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం చిత్రాలు ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే శర్వా తాజాగా నటించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.
ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని శర్వానంద్ తెగ తాపత్రాయపడుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయట.
సోషల్ మీడియాలో జోరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్ సొంతం చేసుకున్నారట. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్లను చెల్లించారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలే నిజమైతే ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్ ఇదే అవుతుంది.
This post was last modified on February 9, 2022 2:14 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…