డింపుల్ హయతి.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అమ్మాయి. పేరు చూస్తే ఉత్తరాది భామ అనిపిస్తుంది కానీ.. నిజానికి తను తెలుగమ్మాయే. తెలుగు పేరు పెట్టుకుని, తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే పట్టించుకోరని పేరు మార్చుకుందా.. లేక ముందు నుంచి ఇదే పేరా అన్నది తెలియదు కానీ.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఈ అమ్మాయికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్తో మెరిశా కొంత కాలం కనిపించకుండా పోయిన ఈ డస్కీ బ్యూటీ.. ఈ మధ్య బాగానే ఛాన్సులందుకుంటోంది. గత వారాంతంలో వచ్చిన సామాన్యుడు సినిమాలో కథానాయికగా మెరిసన డింపుల్కు ఖిలాడి తన కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి డింపుల్ బాగానే కష్టపడ్డట్లుంది. ఇలాంటి మాస్ మసాలా సినిమాల్లో హీరోయిన్లకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం ఉండదు.
గ్లామర్తోనే ఆకట్టుకోవాలి. అందుకేనేమో డింపుల్ ఏ హద్దులూ పెట్టుకోకుండా ఎక్స్పోజింగ్ కొంచెం గట్టిగానే చేసిన సంగతి ప్రోమోల్లో బాగానే తెలుస్తోంది. అది చాలదన్నట్లు ప్రమోషన్లలో కూడా హాట్ లుక్స్తో చంపేస్తోందామె. తాజాగా ఆమె సినిమాలో మరో కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరితో కలిసి మీడియా వాళ్లను కలిసింది.
మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకు మామూలు డ్రెస్లోనే వస్తారు. కానీ డింపుల్ మాత్రం క్లీవేజ్ షోతో మత్తెక్కించే డ్రెస్ వేసుకొచ్చింది. దీంతో కెమెరాల ఫోకస్ అంతా ఆమె మీదే ఉంది. మీడియా మీట్ అవ్వగానే సోషల్ మీడియాలో తన ఫొటోలు వైరల్ అయిపోయాయి. విలేకరుల సమావేశంలో ఇంత హాటా అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన డింపుల్.. మీడియా వాళ్లనే కాక నెటిజన్ల దృష్టిని కూడా బాగానే ఆకర్షించింది. మరి సినిమాలో ఇంకెంతగా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తుందో చూడాలి.
This post was last modified on February 9, 2022 9:30 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…