డింపుల్ హయతి.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అమ్మాయి. పేరు చూస్తే ఉత్తరాది భామ అనిపిస్తుంది కానీ.. నిజానికి తను తెలుగమ్మాయే. తెలుగు పేరు పెట్టుకుని, తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే పట్టించుకోరని పేరు మార్చుకుందా.. లేక ముందు నుంచి ఇదే పేరా అన్నది తెలియదు కానీ.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఈ అమ్మాయికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్తో మెరిశా కొంత కాలం కనిపించకుండా పోయిన ఈ డస్కీ బ్యూటీ.. ఈ మధ్య బాగానే ఛాన్సులందుకుంటోంది. గత వారాంతంలో వచ్చిన సామాన్యుడు సినిమాలో కథానాయికగా మెరిసన డింపుల్కు ఖిలాడి తన కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి డింపుల్ బాగానే కష్టపడ్డట్లుంది. ఇలాంటి మాస్ మసాలా సినిమాల్లో హీరోయిన్లకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం ఉండదు.
గ్లామర్తోనే ఆకట్టుకోవాలి. అందుకేనేమో డింపుల్ ఏ హద్దులూ పెట్టుకోకుండా ఎక్స్పోజింగ్ కొంచెం గట్టిగానే చేసిన సంగతి ప్రోమోల్లో బాగానే తెలుస్తోంది. అది చాలదన్నట్లు ప్రమోషన్లలో కూడా హాట్ లుక్స్తో చంపేస్తోందామె. తాజాగా ఆమె సినిమాలో మరో కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరితో కలిసి మీడియా వాళ్లను కలిసింది.
మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకు మామూలు డ్రెస్లోనే వస్తారు. కానీ డింపుల్ మాత్రం క్లీవేజ్ షోతో మత్తెక్కించే డ్రెస్ వేసుకొచ్చింది. దీంతో కెమెరాల ఫోకస్ అంతా ఆమె మీదే ఉంది. మీడియా మీట్ అవ్వగానే సోషల్ మీడియాలో తన ఫొటోలు వైరల్ అయిపోయాయి. విలేకరుల సమావేశంలో ఇంత హాటా అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన డింపుల్.. మీడియా వాళ్లనే కాక నెటిజన్ల దృష్టిని కూడా బాగానే ఆకర్షించింది. మరి సినిమాలో ఇంకెంతగా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తుందో చూడాలి.
This post was last modified on February 9, 2022 9:30 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…