ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కరోనా మూడో వేవ్ లేకుంటే జనవరి 7నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. అలా రిలీజైతే ఇప్పటికి ఆ సినిమాలో హైలైట్ల గురించి తెగ చర్చ జరుగుతుండేది. కానీ దురదృష్టవశాత్తూ సినిమా వాయిదా పడింది. అయినా ఈ సినిమాపై అంచనాలేమీ తగ్గిపోలేదు.
ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ అలాగే ఉంది. ఇలాంటి టైంలో డిసెంబర్లో ముంబయి వేదికగా జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ తాలూకు వీడియో ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చింది. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలో ఒక సీక్వెన్స్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇప్పటిదాకా ఏ ప్రోమోలో ఆ సన్నివేశం గురించి హింట్ ఇవ్వలేదని.. దానికి సంబంధించి ఎవరికీ ఏమీ చూపించలేదని.. అలాగే ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని.. ఎవ్వరికీ దాని గురించి ఐడియా లేదని.. రేప్పొద్దున థియేటర్లలో ఆ సన్నివేశం చూసినపుడు ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదని జక్కన్న చెప్పాడు.
సినిమాలో ద్వితీయార్ధంలో ఈ సన్నివేశం వస్తుందని.. ఈ సీన్ చూస్తున్నపుడు ఒంట్లోని ప్రతి కండరం బిగుసుకుంటుందని.. ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోతారని.. కానీ అదే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుందని.. ఆ సీన్లో తారక్, చరణ్ అంత అద్భుతంగా చేశారని.. ఇంతకుమించి ఆ సన్నివేశం గురించి తాను ఎక్కువ చెప్పనని.. రేప్పొద్దున థియేటర్లలో చూసినపుడు ఆ సన్నివేశాన్ని అనుభూతి చెందే తీరే వేరుగా ఉంటుందని చెప్పాడు జక్కన్న. తన సినిమాలు వేటిలోనూ ఏ సన్నివేశం గురించీ జక్కన్న విడుదలకు ముందు ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చింది లేదు. మరి ఈ రేంజిలో చెప్పాడంటే ఆ సీన్ ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2022 12:16 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…