ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కరోనా మూడో వేవ్ లేకుంటే జనవరి 7నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. అలా రిలీజైతే ఇప్పటికి ఆ సినిమాలో హైలైట్ల గురించి తెగ చర్చ జరుగుతుండేది. కానీ దురదృష్టవశాత్తూ సినిమా వాయిదా పడింది. అయినా ఈ సినిమాపై అంచనాలేమీ తగ్గిపోలేదు.
ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ అలాగే ఉంది. ఇలాంటి టైంలో డిసెంబర్లో ముంబయి వేదికగా జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ తాలూకు వీడియో ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చింది. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలో ఒక సీక్వెన్స్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇప్పటిదాకా ఏ ప్రోమోలో ఆ సన్నివేశం గురించి హింట్ ఇవ్వలేదని.. దానికి సంబంధించి ఎవరికీ ఏమీ చూపించలేదని.. అలాగే ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని.. ఎవ్వరికీ దాని గురించి ఐడియా లేదని.. రేప్పొద్దున థియేటర్లలో ఆ సన్నివేశం చూసినపుడు ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదని జక్కన్న చెప్పాడు.
సినిమాలో ద్వితీయార్ధంలో ఈ సన్నివేశం వస్తుందని.. ఈ సీన్ చూస్తున్నపుడు ఒంట్లోని ప్రతి కండరం బిగుసుకుంటుందని.. ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోతారని.. కానీ అదే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుందని.. ఆ సీన్లో తారక్, చరణ్ అంత అద్భుతంగా చేశారని.. ఇంతకుమించి ఆ సన్నివేశం గురించి తాను ఎక్కువ చెప్పనని.. రేప్పొద్దున థియేటర్లలో చూసినపుడు ఆ సన్నివేశాన్ని అనుభూతి చెందే తీరే వేరుగా ఉంటుందని చెప్పాడు జక్కన్న. తన సినిమాలు వేటిలోనూ ఏ సన్నివేశం గురించీ జక్కన్న విడుదలకు ముందు ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చింది లేదు. మరి ఈ రేంజిలో చెప్పాడంటే ఆ సీన్ ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2022 12:16 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…