ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కరోనా మూడో వేవ్ లేకుంటే జనవరి 7నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. అలా రిలీజైతే ఇప్పటికి ఆ సినిమాలో హైలైట్ల గురించి తెగ చర్చ జరుగుతుండేది. కానీ దురదృష్టవశాత్తూ సినిమా వాయిదా పడింది. అయినా ఈ సినిమాపై అంచనాలేమీ తగ్గిపోలేదు.
ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ అలాగే ఉంది. ఇలాంటి టైంలో డిసెంబర్లో ముంబయి వేదికగా జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ తాలూకు వీడియో ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చింది. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలో ఒక సీక్వెన్స్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇప్పటిదాకా ఏ ప్రోమోలో ఆ సన్నివేశం గురించి హింట్ ఇవ్వలేదని.. దానికి సంబంధించి ఎవరికీ ఏమీ చూపించలేదని.. అలాగే ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని.. ఎవ్వరికీ దాని గురించి ఐడియా లేదని.. రేప్పొద్దున థియేటర్లలో ఆ సన్నివేశం చూసినపుడు ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదని జక్కన్న చెప్పాడు.
సినిమాలో ద్వితీయార్ధంలో ఈ సన్నివేశం వస్తుందని.. ఈ సీన్ చూస్తున్నపుడు ఒంట్లోని ప్రతి కండరం బిగుసుకుంటుందని.. ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోతారని.. కానీ అదే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుందని.. ఆ సీన్లో తారక్, చరణ్ అంత అద్భుతంగా చేశారని.. ఇంతకుమించి ఆ సన్నివేశం గురించి తాను ఎక్కువ చెప్పనని.. రేప్పొద్దున థియేటర్లలో చూసినపుడు ఆ సన్నివేశాన్ని అనుభూతి చెందే తీరే వేరుగా ఉంటుందని చెప్పాడు జక్కన్న. తన సినిమాలు వేటిలోనూ ఏ సన్నివేశం గురించీ జక్కన్న విడుదలకు ముందు ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చింది లేదు. మరి ఈ రేంజిలో చెప్పాడంటే ఆ సీన్ ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…