పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్ నటిస్తున్న తొలి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కూడా ఇదే. ఈ సినిమా టీజర్ రిలీజైనపుడు అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఐతే వాళ్ల ఎగ్జైట్మెంట్ను నిలబెట్టేలా ఈ సినిమా త్వరగా పూర్తి కాలేదు. విడుదల కూడా బాగా ఆలస్యం అవుతోంది. మధ్యలో ‘భీమ్లా నాయక్’ రావడం వల్ల ఈ చిత్రం ఆలస్యమైంది. కరోనా వల్ల కూడా షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి.
ఐతే ఎట్టకేలకు షూటింగ్ పున:ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నట్లు టీం సంకేతాలు ఇస్తూనే ఉంది. తాజాగా పవన్, క్రిష్లతో పాటు నిర్మాత ఎ.ఎం.రత్నం కలిసి చర్చిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ఒక విశిష్ఠ వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే.. మదన్ కార్కీ. ఇతను లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు తనయుడు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గేయ రచయితగా మంచి పేరు సంపాదించడంతో పాటు మాటల రచయితగానూ సత్తా చాటుకున్నాడు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాలకు తమిళంలో మాటలు, పాటల బాధ్యత తీసుకున్నది మదనే. ‘బాహుబలి’ కోసం అతను కాలకేయుల భాషను కూడా రూపొందించాడు. ఇప్పుడు ఏ భాషా చిత్రాన్నయినా తమిళంలో అనువదించి మంచి క్వాలిటీతో రిలీజ్ చేయాలంటే మదన్ వైపే చూస్తున్నారు. అతను ‘హరి హర వీరమల్లు’ స్క్రిప్టు చర్చల్లో ఉన్నాడంటే.. ఈ సినిమాలో ఆయన భాగస్వామ్యం ఏంటన్న ఆసక్తి రేకెత్తుతోంది.
బహుశా ‘వీరమల్లు’ను తమిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుంది చిత్ర బృందం. రత్నంకు తమిళ మార్కెట్పై మంచి పట్టుంది. ఆయన బేసిగ్గా తమిళ నిర్మాతే. ‘హరి హర వీరమల్లు’ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీన్ని తమిళంలో రిలీజ్ చేస్తే బాహుబలి స్థాయిలో కాకున్నా మంచి ఫలితమే రాబడుతుందని భావిస్తున్నట్లున్నారు.
This post was last modified on February 6, 2022 5:01 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…