త్రివిక్ర‌మ్ మూవీ అంటేనే భ‌య‌ప‌డుతున్న హీరోయిన్లు..

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఒక‌రు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ‘అల వైకుంఠపురంలో’ 2020లో విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ హిట్ అనంత‌రం లాంగ్ గ్యాప్‌ తీసుకున్న త్రివిక్ర‌మ్‌.. ఇటీవ‌లె సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

అయితే ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా ఉండ‌నుంద‌ట‌. కానీ, త్రివిక్ర‌మ్ మూవీలో సెకెండ్ లీడ్ రోల్‌ అంటేనే హీరోయిన్లు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు త్రివిక్ర‌మ్ మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించిన వారింద‌రూ కెరీర్ ప‌రంగా చాలా వెన‌క‌ప‌డిపోయారు.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌ల్సా మూవీలో మెయిన్ హీరోయిన్‌గా ఇలియానా న‌టించ‌గా.. సెకెండ్ హీరోయిన్‌గా పార్వతీ మెల్టన్ న‌టించింది. కానీ, ఈ మూవీ అనంత‌రం పార్వ‌తీ మెల్ట‌న్ టాలీవుడ్‌లో ఎక్కువ కాలం నెల‌దొక్కుకోలేక‌పోయింది.

ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది మూవీలో ప్ర‌ణీత‌, సన్నాఫ్ సత్యమూర్తిలో ఆదా శర్మ, అ ఆలో అనుపమా పరమేశ్వరన్, అజ్ఞాతవాసిలో అనూ ఇమ్మాన్యూయేల్, అరవింద సమేత వీర రాఘవలో ఈశా రెబ్బా, అల వైకుంఠపురములో మూవీలో నివేతా పేతురాజ్‌లు సెకెండ్ హీరోయిన్‌గా న‌టించారు. అయితే వీరంద‌రూ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా వెన‌క‌పడే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.