దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు ముంబయి మీడియా వర్గాలంటున్నాయి. లతను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది. కరోనాకు తోడు న్యుమోనియా సోకడంతో గత నెలలో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నెల రోజులకు పైగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉంచి లతకు చికిత్స అందిస్తున్నారు.
మధ్యలో ఆమె పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత ఆమె కోలుకోవడం.. ఇటీవల ఆమె పరిస్థితి మరింత మెరుగైనట్లు అధికారిక ప్రకటనలు కూడా రావడం తెలిసిందే. కానీ లతను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె పరిస్థితి ఏంటో అర్థం కాక అభిమానులు అయోమయానికి గురయ్యారు.
ఆమెకు ప్రమాదం అయితే తప్పలేదని భావించారు. ఆ అనుమానాలకు తగ్గట్లే ఇప్పుడు లత పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు కనిపిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ దుష్ప్రభావం, న్యుమోనియా కారణంగా లత పరిస్థితి ఇబ్బందిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందట గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వైరస్ దుష్ప్రభావాలతో అవయవాలు దెబ్బ తిని ఆయన పరిస్థితి విషమించింది.
మధ్యలో కోలుకున్నట్లే కనిపించినా.. తిరిగి పరిస్థితి ఇబ్బందికరంగా మారి చివరికి ఆయన తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ అందుకు భిన్నంగా విషమ స్థితిని అధిగమించి కోలుకుని మళ్లీ ఇంటికి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా హిందీలో పాటలు పాడిన లత.. ఏకంగా 36 భాషల్లో వేల కొద్దీ పాటలు ఆలపించడం విశేషం. 92 ఏళ్ల లతా మంగేష్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
This post was last modified on February 5, 2022 7:42 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…