దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు ముంబయి మీడియా వర్గాలంటున్నాయి. లతను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది. కరోనాకు తోడు న్యుమోనియా సోకడంతో గత నెలలో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నెల రోజులకు పైగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉంచి లతకు చికిత్స అందిస్తున్నారు.
మధ్యలో ఆమె పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత ఆమె కోలుకోవడం.. ఇటీవల ఆమె పరిస్థితి మరింత మెరుగైనట్లు అధికారిక ప్రకటనలు కూడా రావడం తెలిసిందే. కానీ లతను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె పరిస్థితి ఏంటో అర్థం కాక అభిమానులు అయోమయానికి గురయ్యారు.
ఆమెకు ప్రమాదం అయితే తప్పలేదని భావించారు. ఆ అనుమానాలకు తగ్గట్లే ఇప్పుడు లత పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు కనిపిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ దుష్ప్రభావం, న్యుమోనియా కారణంగా లత పరిస్థితి ఇబ్బందిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందట గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వైరస్ దుష్ప్రభావాలతో అవయవాలు దెబ్బ తిని ఆయన పరిస్థితి విషమించింది.
మధ్యలో కోలుకున్నట్లే కనిపించినా.. తిరిగి పరిస్థితి ఇబ్బందికరంగా మారి చివరికి ఆయన తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ అందుకు భిన్నంగా విషమ స్థితిని అధిగమించి కోలుకుని మళ్లీ ఇంటికి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా హిందీలో పాటలు పాడిన లత.. ఏకంగా 36 భాషల్లో వేల కొద్దీ పాటలు ఆలపించడం విశేషం. 92 ఏళ్ల లతా మంగేష్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
This post was last modified on February 5, 2022 7:42 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…