దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు ముంబయి మీడియా వర్గాలంటున్నాయి. లతను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది. కరోనాకు తోడు న్యుమోనియా సోకడంతో గత నెలలో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నెల రోజులకు పైగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉంచి లతకు చికిత్స అందిస్తున్నారు.
మధ్యలో ఆమె పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత ఆమె కోలుకోవడం.. ఇటీవల ఆమె పరిస్థితి మరింత మెరుగైనట్లు అధికారిక ప్రకటనలు కూడా రావడం తెలిసిందే. కానీ లతను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె పరిస్థితి ఏంటో అర్థం కాక అభిమానులు అయోమయానికి గురయ్యారు.
ఆమెకు ప్రమాదం అయితే తప్పలేదని భావించారు. ఆ అనుమానాలకు తగ్గట్లే ఇప్పుడు లత పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు కనిపిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ దుష్ప్రభావం, న్యుమోనియా కారణంగా లత పరిస్థితి ఇబ్బందిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందట గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వైరస్ దుష్ప్రభావాలతో అవయవాలు దెబ్బ తిని ఆయన పరిస్థితి విషమించింది.
మధ్యలో కోలుకున్నట్లే కనిపించినా.. తిరిగి పరిస్థితి ఇబ్బందికరంగా మారి చివరికి ఆయన తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ అందుకు భిన్నంగా విషమ స్థితిని అధిగమించి కోలుకుని మళ్లీ ఇంటికి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా హిందీలో పాటలు పాడిన లత.. ఏకంగా 36 భాషల్లో వేల కొద్దీ పాటలు ఆలపించడం విశేషం. 92 ఏళ్ల లతా మంగేష్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
This post was last modified on February 5, 2022 7:42 pm
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…
పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…