దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు ముంబయి మీడియా వర్గాలంటున్నాయి. లతను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది. కరోనాకు తోడు న్యుమోనియా సోకడంతో గత నెలలో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నెల రోజులకు పైగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉంచి లతకు చికిత్స అందిస్తున్నారు.
మధ్యలో ఆమె పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత ఆమె కోలుకోవడం.. ఇటీవల ఆమె పరిస్థితి మరింత మెరుగైనట్లు అధికారిక ప్రకటనలు కూడా రావడం తెలిసిందే. కానీ లతను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె పరిస్థితి ఏంటో అర్థం కాక అభిమానులు అయోమయానికి గురయ్యారు.
ఆమెకు ప్రమాదం అయితే తప్పలేదని భావించారు. ఆ అనుమానాలకు తగ్గట్లే ఇప్పుడు లత పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు కనిపిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ దుష్ప్రభావం, న్యుమోనియా కారణంగా లత పరిస్థితి ఇబ్బందిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందట గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వైరస్ దుష్ప్రభావాలతో అవయవాలు దెబ్బ తిని ఆయన పరిస్థితి విషమించింది.
మధ్యలో కోలుకున్నట్లే కనిపించినా.. తిరిగి పరిస్థితి ఇబ్బందికరంగా మారి చివరికి ఆయన తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ అందుకు భిన్నంగా విషమ స్థితిని అధిగమించి కోలుకుని మళ్లీ ఇంటికి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా హిందీలో పాటలు పాడిన లత.. ఏకంగా 36 భాషల్లో వేల కొద్దీ పాటలు ఆలపించడం విశేషం. 92 ఏళ్ల లతా మంగేష్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
This post was last modified on February 5, 2022 7:42 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…