మెగా హీరోల తమిళ రీమేక్ ఈమధ్య మన హీరోలంతా ఇతర భాషల సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. వాటి రీమేక్స్లో నటించాలని ఆశపడుతున్నారు. ఈ విషయంలో మెగా హీరోలే కాస్త ముందున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్స్ని లైన్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ వకీల్సాబ్గా మెప్పించాక భీమ్లానాయక్తో బరిలోకి దిగాడు. ఇప్పుడు మరో మెగా రీమేక్ గురించిన వార్తలు గుప్పుమంటున్నాయి.
తంబి రామయ్య, సముద్రఖని ప్రధాన పాత్రల్లో పోయినేడు ‘వినోదాయ సితమ్’ అనే తమిళ చిత్రం విడుదలైంది. ఇదో ఫ్యాంటసీ డ్రామా. ఓటీటీలో రిలీజైనా మంచి టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో మన నిర్మాతల కన్ను దానిపై పడింది. ఆల్రెడీ రీమేక్కి ఏర్పాట్లు జరుగుతున్నాయని, పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనతో నటించే రెండో హీరో ఎవరు అనేదానికి జవాబు దొరకలేదు.
కానీ ఇప్పుడు ఆ హీరో పేరు బైటికి వచ్చింది. అతనెవరో కాదు.. సాయి ధరమ్ తేజ్. ఈ రీమేక్లో పవన్తో పాటు తేజ్ నటిస్తాడనే వార్త వైరల్ అవుతోంది. యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలల పాటు నటనకి దూరంగా ఉన్న తేజ్, త్వరలో సెట్స్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అతను చేయబోయే సినిమాల లిస్టులో ఇది కూడా ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒరిజినల్ను తెరకెక్కించిన సముద్రఖనియే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.
వినడానికే ఈ వార్త ఎక్సయిటింగ్గా ఉంది. ఒక మెగా హీరో మరో మెగా హీరో మూవీలో తళుక్కుమనడం చాలాసార్లు చూశాం. కానీ ఇద్దరు మెగా హీరోలు కలిసి ఓ ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్లో పవన్, రామ్ చరణ్ కలిసి నటిస్తారని అందరూ ఆశపడ్డారు కానీ అది వర్కవుటవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ అయినా పట్టాలెక్కితే వారి ఆశ తీరుతుంది. లేదంటే ఇది కూడా ఓ పుకారుగానే మిగిలిపోతుంది.
This post was last modified on February 4, 2022 10:23 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…