Movie News

మలయాళ స్టార్ మెస్మరైజ్ చేసేస్తున్నాడు

అరవయ్యొక్కేళ్ల వయసు. మిగతా హీరోలతో పోలిస్తే కాస్త భారీగానే అనిపించే శరీరం. కానీ ఆయన ఎనర్జీ చూస్తే మాత్రం ఇరవైల్లో ఉన్న హీరో కూడా ఈర్ష్య పడాల్సిందే. ఇదంతా ఎవరి గురించి అంటే.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ గురించే. ఆయన వయసులో ఉన్న హీరోలు ఇంకా ఉన్నారు.

వాళ్లూ యాక్ట్ చేస్తున్నారు. కానీ వారందరితో పోలిస్తే ఈయన కరిష్మానే వేరు. తాజాగా మోహన్‌లాల్ నటిస్తున్న ‘ఆరట్టు’ సినిమా ట్రైలర్ రిలీజైంది. దీన్ని చూసి మెస్మరైజ్ కానివాళ్లు లేరు. అయామ్‌ నాట్‌ ఎ గ్యాంగ్‌స్టర్‌‌.. అయామ్‌ నాట్‌ ఎ మాన్‌స్టర్.. అయామ్‌ సినిస్టర్.. అయామ్ లూసిఫర్ అంటూ గంభీరమైన వాయిస్‌తో డైలాగ్స్ చెప్పడమే కాదు.. యాక్షన్ సీన్స్‌తోనూ అదరగొట్టేశారు లాల్.

ఆ పంచెకట్టులోని అందం.. నడకలోని హుందాతనం.. నవ్వులోని గాంభీర్యంతో పాటు ‘నేను చాలా డేంజరస్‌’ అంటూ తెలుగులో చెప్పిన డైలాగ్‌ వహ్వా అనిపించాయి.    మోహన్‌లాల్‌కి ఇప్పటికీ ఎందుకింత డిమాండ్ ఉందో ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది.

ఆయన ఎనర్జీ లెవెల్స్‌ సామాన్యమైనవి కావు. అందుకే ఈ వయసులో కూడా ఒకేసారి ఏడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అఖిల్ ‘ఏజెంట్‌’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అజిత్ నెక్స్ట్‌ మూవీలోనూ ఇంపార్టెంల్ రోల్ చేయబోతున్నారు. మొత్తానికి తన దూకుడుతో యంగ్‌ హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నారు మోహన్‌లాల్.

This post was last modified on February 4, 2022 10:18 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago