Movie News

కామెడీ మూవీతో హాసిని రీఎంట్రీ

హ హ హాసిని అంటూ ఒకప్పుడు కుర్రకారు గుండెలకు గేలాలు వేసి లాగింది జెనీలియా. కెరీర్‌‌ పీక్స్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటుడు, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అయిన రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడి ముంబై వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలాసార్లు ఆమె రీ ఎంట్రీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి ఇన్నాళ్లకి నిజమవుతున్నాయి.     

ఎట్టకేలకి జెనీలియా హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. నిజానికి ఆమె నటనకు ఎప్పుడూ దూరమైపోలేదు. ఎప్పడైనా ఓ సినిమాలో గెస్ట్‌గా మెరుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయి హీరోయిన్‌గా వస్తోంది. తన భర్త రితేష్‌తో కలిసి ‘మిస్టర్ మమ్మీ’ అనే మూవీలో నటిస్తోంది జెనీ. షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను కూడా వదిలారు.     

ఈ పోస్టర్ చూడటానికే చాలా ఫన్నీగా ఉంది. జెనీలియా ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆమె పక్కనే ఉన్న రితేష్ కూడా బేబీ బంప్‌తో ఉన్నాడు. దాంతో ఇదేదో డిఫరెంట్‌ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతోంది. అది ముమ్మాటికీ నిజమే అంటున్నారు మేకర్స్. ఇదో కామెడీ ఫిల్మ్ అని, ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు.      

ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు జెనీలియా కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. తన కెరీర్‌‌ బాలీవుడ్ మూవీతో స్టార్టయ్యింది. అందులో రితేష్ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలోనూ అతనే హీరో కావడం ఎక్సయిటింగ్‌గా ఉందంటోందామె. మరి అప్పటిలాగే ఇప్పుడు కూడా బిజీ హీరోయిన్‌ అవుతుందో లేదో చూడాలి. 

This post was last modified on February 4, 2022 8:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

34 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago