హ హ హాసిని అంటూ ఒకప్పుడు కుర్రకారు గుండెలకు గేలాలు వేసి లాగింది జెనీలియా. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటుడు, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అయిన రితేష్ దేశ్ముఖ్ని పెళ్లాడి ముంబై వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలాసార్లు ఆమె రీ ఎంట్రీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి ఇన్నాళ్లకి నిజమవుతున్నాయి.
ఎట్టకేలకి జెనీలియా హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. నిజానికి ఆమె నటనకు ఎప్పుడూ దూరమైపోలేదు. ఎప్పడైనా ఓ సినిమాలో గెస్ట్గా మెరుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయి హీరోయిన్గా వస్తోంది. తన భర్త రితేష్తో కలిసి ‘మిస్టర్ మమ్మీ’ అనే మూవీలో నటిస్తోంది జెనీ. షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్గా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా వదిలారు.
ఈ పోస్టర్ చూడటానికే చాలా ఫన్నీగా ఉంది. జెనీలియా ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె పక్కనే ఉన్న రితేష్ కూడా బేబీ బంప్తో ఉన్నాడు. దాంతో ఇదేదో డిఫరెంట్ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతోంది. అది ముమ్మాటికీ నిజమే అంటున్నారు మేకర్స్. ఇదో కామెడీ ఫిల్మ్ అని, ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు.
ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు జెనీలియా కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. తన కెరీర్ బాలీవుడ్ మూవీతో స్టార్టయ్యింది. అందులో రితేష్ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె హీరోయిన్గా నటిస్తున్న సినిమాలోనూ అతనే హీరో కావడం ఎక్సయిటింగ్గా ఉందంటోందామె. మరి అప్పటిలాగే ఇప్పుడు కూడా బిజీ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.
This post was last modified on February 4, 2022 8:06 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…