కరోనా భయం జనాల్లో ఏమాత్రం కనిపించడం లేదు. వ్యాపారాలన్నీ యధావిధిగా నడిచిపోతున్నాయి. జనాలు మామూలుగానే తిరిగేస్తున్నారు. కానీ కరోనా థర్డ్ వేవ్ విషయంలో చాలా భయపడిపోయి సంక్రాంతికి రావాల్సిన భారీ చిత్రాలు వాయిదా పడిపోయాయి. ఆ తర్వాత రావాల్సిన మీడియం రేంజ్ సినిమాలు కూడా వెనక్కి తగ్గాయి. దీంతో బాక్సాఫీస్ వెలవెలబోతోంది.
సంక్రాంతి వీకెండ్ తర్వాత రెండు వారాల్లో రిలీజైన చెప్పుకోదగ్గ చిత్రం అంటే ‘గుడ్ లక్ సఖి’ ఒక్కటే. అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుని తొలి వీకెండ్లోనే అడ్రస్ లేకుండా పోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా ఉపయోగించుకునే సినిమానే కనిపించడం లేదు. ఈ వారానికి షెడ్యూల్ అయిన ‘డీజే టిల్లు’ కూడా వాయిదా పడిపోవడంతో ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లడానికి కారణమే కనిపించడం లేదు.ఐతే తెలుగు సినిమాల నిర్మాతలందరూ చేతులెత్తేసిన టైంలో ఓ తమిళ అనువాద చిత్రం శుక్రవారం బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. అదే విశాల్ నటించిన ‘సామాన్యుడు’.
కరోనా భయాలను పక్కన పెట్టేసి ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసేస్తున్నాడు విశాల్. తు.పా.శరవణన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం.. విశాల్ స్టయిల్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. తెలుగులో అసలు పోటీయే లేదీ చిత్రానికి.
విశాల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. కోరుకున్నన్ని థియేటర్లు ఇచ్చేశారు. ఇది తప్ప కనీస స్థాయిలో పేరున్న సినిమా ఏదీ రిలీజ్ కావట్లేదీ వారం. ఆల్రెడీ సంక్రాంతి సినిమాలతో పాటు తర్వాత వచ్చిన సినిమాల థియేట్రికల్ రన్ ముగిసిపోయింది. ‘సామాన్యుడు’కు అసలు ఎదురే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం బాక్సాఫీస్ను విశాల్కు రాసిచ్చేసినట్లే. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ‘సామాన్యుడు’తో హిట్ కొడతాడేమో చూడాలి విశాల్.
This post was last modified on February 4, 2022 9:43 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…