యువత మీద చెడు ప్రభావం చూపేలా ఉందంటూ ‘పుష్ప’ సినిమా మీద పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విరుచుకుపడ్డ సమయంలోనే.. ఆ సినిమా స్ఫూర్తితో భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్కు ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోవడం సంచలనం రేపుతోంది. ‘పుష్ప’ సినిమాలో పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం తరలించడానికి హీరో రకరకాల మార్గాలు కనుక్కొంటాడన్న సంగతి తెలిసిందే.
పాల వ్యానులో సగం వరకు ఎర్రచందనం దుంగల్ని పెట్టి.. వెల్డింగ్ చేసి, దానిపైన పాలు పోయడం.. పెళ్లికి జనాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్లో కింద దుంగలు పరిచడం.. అంబులెన్సుల్లో చందనం దుంగలు పెట్టడం.. ఇలా రకరకాల మార్గాల్లో హీరో చందనం స్మగ్లింగ్ చేస్తాడు. ఇవన్నీ చూసి స్ఫూర్తి పొంది సినీ ఫక్కీలో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని తరలిస్తున్న యాసిన్ ఇనాయతుల్లా అనే స్మగ్లర్ మహారాష్ట్రాలో పోలీసులకు దొరికిపోయాడు.
ఎర్రచందనం దుంగల్ని ఒక ట్రక్కులో కింద పరిచేసి.. వాటి మీద కూరగాయలు, పళ్లు పెట్టి కర్ణాటక బార్డర్ దాటించిన ఇనాయతుల్లా మహారాష్ట్రాలో పోలీసుల తనిఖీ సందర్భంగా దొరికిపోయాడు. అతను రవాణా చేస్తున్న దుంగల విలువ రూ.2.45 కోట్లు కావడం గమనార్హం. పోలీసుల కళ్లు గప్పాడో.. వాళ్లకు లంచాలిచ్చి బయటపడ్డాడో కానీ.. కొన్ని వందల కిలోమీటర్లు సాఫీగానే ఆ స్మగ్లర్ ప్రయాణం సాగిపోయింది.
కానీ మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఇనాయతుల్లాను విడిచిపెట్టలేదు. ‘పుష్ప’ సినిమా స్ఫూర్తితోనే ఇలా చేసినట్లు సదరు స్మగ్లర్ పోలీసులకు చెప్పాడట. సంబంధింత ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కనుక చూస్తే గరికపాటి నరసింహారావు మరింతగా ‘పుష్ప’ సినిమా మీద ఫైర్ అవుతారేమో.
This post was last modified on February 3, 2022 9:35 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…