హీరోగా, నిర్మాతగానే కాక దర్శకుడిగానూ దూసుకుపోతున్న అజయ్ దేవగన్.. మరోవైపు ఇతర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’లో ఎంతో ముఖ్యమైన పాత్రలో నటించాడు. నిడివి తక్కువే అయినా తనది సినిమాకి పిల్లర్ లాంటి క్యారెక్టర్ అని రాజమౌళి చెప్పాడు. ‘గంగూబాయ్ కథియావాడి’లో కూడా అలాంటి పాత్రే పోషించాడు అజయ్.
ముంబైలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాని శాసించిన గంగూబాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఆలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ పూర్తై చాలా కాలమైంది. విడుదల చేద్దామంటే కరోనా అడ్డుపడింది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకి ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముహూర్తం కుదిరింది. దాంతో ప్రమోషన్స్లో జోరు పెంచారు మేకర్స్.
త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నామంటూ ఆలియా బ్యూటిఫుల్ ఫొటో ఒకటి నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు అజయ్ దేవగన్ లుక్ని కూడా రివీల్ చేశారు. నేనెవరో మీకు చూపించడానికి వచ్చేస్తున్నాను అంటూ తన ఫస్ట్ లుక్ పోస్టర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అజయ్. సూటూ బూటూ, తలపై టోపీ, కళ్లకి గాగుల్స్ పెట్టి ఓ టెరిఫిక్ గెటప్లో ఉన్నాడు అజయ్.
గంగూబాయ్ని చిన్నతనంలోనే ఎవరో ముంబైలోని కామాఠిపురా అనే రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తారు. అక్కడే పెరిగి పెద్దదవుతుంది. ఓ టైమ్ వచ్చేసరికి ఆ ఏరియాకి రాణి అయిపోతుంది. మాఫియా లీడర్లతో సంబంధాలు పెట్టుకుంటుంది. రాజకీయ నాయకుల్ని కూడా లెక్క చేయనంత స్ట్రాంగ్ అయిపోతుంది. అలాంటి గంగూబాయ్ ఓ వ్యక్తిని అన్నలా భావిస్తుంది. అతని పాత్రనే అజయ్ పోషించాడని టాక్. పాత్ర ఏదైతేనేం.. అజయ్ లుక్ మాత్రం అదిరిపోయిందనేది వాస్తవం.
This post was last modified on February 3, 2022 4:25 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…