హీరోగా, నిర్మాతగానే కాక దర్శకుడిగానూ దూసుకుపోతున్న అజయ్ దేవగన్.. మరోవైపు ఇతర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’లో ఎంతో ముఖ్యమైన పాత్రలో నటించాడు. నిడివి తక్కువే అయినా తనది సినిమాకి పిల్లర్ లాంటి క్యారెక్టర్ అని రాజమౌళి చెప్పాడు. ‘గంగూబాయ్ కథియావాడి’లో కూడా అలాంటి పాత్రే పోషించాడు అజయ్.
ముంబైలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాని శాసించిన గంగూబాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఆలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ పూర్తై చాలా కాలమైంది. విడుదల చేద్దామంటే కరోనా అడ్డుపడింది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకి ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముహూర్తం కుదిరింది. దాంతో ప్రమోషన్స్లో జోరు పెంచారు మేకర్స్.
త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నామంటూ ఆలియా బ్యూటిఫుల్ ఫొటో ఒకటి నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు అజయ్ దేవగన్ లుక్ని కూడా రివీల్ చేశారు. నేనెవరో మీకు చూపించడానికి వచ్చేస్తున్నాను అంటూ తన ఫస్ట్ లుక్ పోస్టర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అజయ్. సూటూ బూటూ, తలపై టోపీ, కళ్లకి గాగుల్స్ పెట్టి ఓ టెరిఫిక్ గెటప్లో ఉన్నాడు అజయ్.
గంగూబాయ్ని చిన్నతనంలోనే ఎవరో ముంబైలోని కామాఠిపురా అనే రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తారు. అక్కడే పెరిగి పెద్దదవుతుంది. ఓ టైమ్ వచ్చేసరికి ఆ ఏరియాకి రాణి అయిపోతుంది. మాఫియా లీడర్లతో సంబంధాలు పెట్టుకుంటుంది. రాజకీయ నాయకుల్ని కూడా లెక్క చేయనంత స్ట్రాంగ్ అయిపోతుంది. అలాంటి గంగూబాయ్ ఓ వ్యక్తిని అన్నలా భావిస్తుంది. అతని పాత్రనే అజయ్ పోషించాడని టాక్. పాత్ర ఏదైతేనేం.. అజయ్ లుక్ మాత్రం అదిరిపోయిందనేది వాస్తవం.
This post was last modified on February 3, 2022 4:25 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…