Movie News

‘ఖిలాడి’ని వాయిదా వేయించిన జగన్

మాస్ మహరాజా రవితేజ కొత్త సినిమా ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా మూడో వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని 11నే రిలీజ్ చేయాలని పట్టుదలతో కనిపించింది చిత్ర బృందం. ఈ దిశగా ప్రమోషన్లు కూడా జోరుగానే నడుస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయినట్లు సమాచారం.

ఇందుక్కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే. నిజానికి ఈ వారంతో ఏపీలో నైట్ కర్ఫ్యూ ముగుస్తుందని అనుకున్నారు. ఆ అంచనాతోనే 11న ‘ఖిలాడి’ని రిలీజ్ చేయొచ్చని భావించారు. కానీ జగన్ సర్కారు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 14 వరకు ఇది అమలవుతుందని ప్రకటించింది. దీంతో సెకండ్ షోలకు ఇబ్బంది అవుతుంది. ఆదాయానికి గండి పడుతుంది.

50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల పడే కోతకు తోడు సెకండ్ షోలు కూడా రద్దయ్యాయంటే కష్టమవుతుంది.అందుకే ‘ఖిలాడి’ టీం రిలీజ్‌ను ఒక వారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ నైట్ కర్ఫ్యూ పొడిగించకుంటే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందని, కర్ఫ్యూ కచ్చితంగా ఎత్తేస్తారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా థియేటర్లపై ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తున్నారు.

కానీ ఏపీలో మాత్రం చిత్రంగా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఏ ప్రయోజనం లేకుండా నైట్ కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా సెకండ్ షోలను రద్దు చేయిస్తున్నారు. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ‘ఖిలాడి’ వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఫిబ్రవరి 11న ‘సెహరి’తో పాటు ‘డీజే టిల్లు’ రాబోతున్నాయి. ‘డీజే టిల్లు’ను ఈ వారమే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. వారం వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on February 2, 2022 7:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

37 minutes ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

1 hour ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

2 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

3 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

3 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

3 hours ago