భీమ్లా నాయక్ సంక్రాంతి రావాల్సిన సినిమా. అనూహ్య పరిణామాల మధ్య ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ తేదీకి రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కరోనా మూడో వేవ్ భయం అనుకున్నంతగా లేకపోయినా.. ఈ నెల 25వ తేదీకి పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయని అనిపిస్తున్నా.. ఆ టైంకి ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే ఛాన్సున్నా సరే.. ఆ డేట్కు చిత్ర బృందం కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’ వాయిదా పడటం గ్యారెంటీ అని వేరే నిర్మాతలు కూడా ఫిక్సయినట్లే ఉన్నారు.
ఈ విషయంలో వారికి స్పష్టమైన సమాచారమే ఉన్నట్లుంది. ఆల్రెడీ ఈ తేదీకి శర్వానంద్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘సెబాస్టియన్’ను కూడా అదే రోజుకు ఫిక్స్ చేశారు. ఇవి చాలవన్నట్లు తమిళ అనువాద చిత్రం ‘వలిమై’ను ఫిబ్రవరి 24కు ఖాయం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించిన ఆ చిత్రాన్ని తెలుగులోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ వచ్చేట్లయితే ఈ మూడు చిత్రాలు రేసులోకి వచ్చేవి కావు. ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేయడం వ్యూహాత్మకంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో కక్ష కట్టిందో పోయినేడాది ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే స్పష్టం అయింది. ఇప్పుడు భారీ చిత్రాల వరుసలో ముందుగా వస్తే ఆ సినిమాను కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది.
అందుకే ఏదో ఒక భారీ చిత్రం ముందు రిలీజై.. దానికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూసుకుని ఆ తర్వాత తమ చిత్రాన్ని థియేటర్లలోకి దించాలన్న ఆలోచనతో ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మార్చిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాటికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో వెసులుబాటు దక్కే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. వాటి విషయంలో ఏం జరుగుతుందో చూసుకుని సెకండ్ ఆప్షన్గా పెట్టుకున్న ఏప్రిల్ 1నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేయడానికి మెండుగా అవకాశాలున్నాయి.
This post was last modified on February 2, 2022 2:27 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…