భీమ్లా నాయక్ సంక్రాంతి రావాల్సిన సినిమా. అనూహ్య పరిణామాల మధ్య ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ తేదీకి రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కరోనా మూడో వేవ్ భయం అనుకున్నంతగా లేకపోయినా.. ఈ నెల 25వ తేదీకి పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయని అనిపిస్తున్నా.. ఆ టైంకి ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే ఛాన్సున్నా సరే.. ఆ డేట్కు చిత్ర బృందం కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’ వాయిదా పడటం గ్యారెంటీ అని వేరే నిర్మాతలు కూడా ఫిక్సయినట్లే ఉన్నారు.
ఈ విషయంలో వారికి స్పష్టమైన సమాచారమే ఉన్నట్లుంది. ఆల్రెడీ ఈ తేదీకి శర్వానంద్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘సెబాస్టియన్’ను కూడా అదే రోజుకు ఫిక్స్ చేశారు. ఇవి చాలవన్నట్లు తమిళ అనువాద చిత్రం ‘వలిమై’ను ఫిబ్రవరి 24కు ఖాయం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించిన ఆ చిత్రాన్ని తెలుగులోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ వచ్చేట్లయితే ఈ మూడు చిత్రాలు రేసులోకి వచ్చేవి కావు. ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేయడం వ్యూహాత్మకంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో కక్ష కట్టిందో పోయినేడాది ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే స్పష్టం అయింది. ఇప్పుడు భారీ చిత్రాల వరుసలో ముందుగా వస్తే ఆ సినిమాను కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది.
అందుకే ఏదో ఒక భారీ చిత్రం ముందు రిలీజై.. దానికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూసుకుని ఆ తర్వాత తమ చిత్రాన్ని థియేటర్లలోకి దించాలన్న ఆలోచనతో ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మార్చిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాటికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో వెసులుబాటు దక్కే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. వాటి విషయంలో ఏం జరుగుతుందో చూసుకుని సెకండ్ ఆప్షన్గా పెట్టుకున్న ఏప్రిల్ 1నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేయడానికి మెండుగా అవకాశాలున్నాయి.
This post was last modified on February 2, 2022 2:27 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…