భీమ్లా నాయక్ సంక్రాంతి రావాల్సిన సినిమా. అనూహ్య పరిణామాల మధ్య ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ తేదీకి రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కరోనా మూడో వేవ్ భయం అనుకున్నంతగా లేకపోయినా.. ఈ నెల 25వ తేదీకి పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయని అనిపిస్తున్నా.. ఆ టైంకి ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే ఛాన్సున్నా సరే.. ఆ డేట్కు చిత్ర బృందం కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’ వాయిదా పడటం గ్యారెంటీ అని వేరే నిర్మాతలు కూడా ఫిక్సయినట్లే ఉన్నారు.
ఈ విషయంలో వారికి స్పష్టమైన సమాచారమే ఉన్నట్లుంది. ఆల్రెడీ ఈ తేదీకి శర్వానంద్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘సెబాస్టియన్’ను కూడా అదే రోజుకు ఫిక్స్ చేశారు. ఇవి చాలవన్నట్లు తమిళ అనువాద చిత్రం ‘వలిమై’ను ఫిబ్రవరి 24కు ఖాయం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించిన ఆ చిత్రాన్ని తెలుగులోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ వచ్చేట్లయితే ఈ మూడు చిత్రాలు రేసులోకి వచ్చేవి కావు. ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేయడం వ్యూహాత్మకంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో కక్ష కట్టిందో పోయినేడాది ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే స్పష్టం అయింది. ఇప్పుడు భారీ చిత్రాల వరుసలో ముందుగా వస్తే ఆ సినిమాను కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది.
అందుకే ఏదో ఒక భారీ చిత్రం ముందు రిలీజై.. దానికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూసుకుని ఆ తర్వాత తమ చిత్రాన్ని థియేటర్లలోకి దించాలన్న ఆలోచనతో ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మార్చిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాటికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో వెసులుబాటు దక్కే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. వాటి విషయంలో ఏం జరుగుతుందో చూసుకుని సెకండ్ ఆప్షన్గా పెట్టుకున్న ఏప్రిల్ 1నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేయడానికి మెండుగా అవకాశాలున్నాయి.
This post was last modified on February 2, 2022 2:27 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…