Movie News

హాస్పిటల్‌లో ధనుష్ మాజీ భార్య

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె, స్టార్ హీరో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య‌ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. తాజాగా ఆమెకు క‌రోనా సోకింది. ప‌రిస్థితి కాస్త సీరియ‌స్‌గా ఉండ‌టం వ‌ల్ల ఐశ్వ‌ర్య వెంట‌నే హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐశ్వ‌ర్య‌ స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ..`జాగ్రత్తల‌న్నీ తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి,  టీకాలు వేయించుకుని సురక్షితంగా ఉండండి. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఐశ్వ‌ర్య త్వ‌ర‌గా క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించి ఆరోగ్య‌వంతంగా తిరిగిరావాల‌ని అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాక్షిస్తున్నారు.

కాగా, కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు.. ఇటీవ‌లె త‌మ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట‌.. చాలా అన్యోన్యంగా ఉంటూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. ఈ దంప‌తుల‌కు యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.

కానీ, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కొద్ది రోజుల క్రితం తాము విడాకులు తీసుకుంటున్నామ‌ని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు అధికారికంగా ప్ర‌క‌టించి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ స్టార్ క‌పుల్ విడిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అభిమానులు వీరి బ్రేక‌ప్‌ను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

5 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

13 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago