Movie News

హాస్పిటల్‌లో ధనుష్ మాజీ భార్య

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె, స్టార్ హీరో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య‌ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. తాజాగా ఆమెకు క‌రోనా సోకింది. ప‌రిస్థితి కాస్త సీరియ‌స్‌గా ఉండ‌టం వ‌ల్ల ఐశ్వ‌ర్య వెంట‌నే హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐశ్వ‌ర్య‌ స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ..`జాగ్రత్తల‌న్నీ తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి,  టీకాలు వేయించుకుని సురక్షితంగా ఉండండి. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఐశ్వ‌ర్య త్వ‌ర‌గా క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించి ఆరోగ్య‌వంతంగా తిరిగిరావాల‌ని అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాక్షిస్తున్నారు.

కాగా, కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు.. ఇటీవ‌లె త‌మ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట‌.. చాలా అన్యోన్యంగా ఉంటూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. ఈ దంప‌తుల‌కు యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.

కానీ, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కొద్ది రోజుల క్రితం తాము విడాకులు తీసుకుంటున్నామ‌ని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు అధికారికంగా ప్ర‌క‌టించి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ స్టార్ క‌పుల్ విడిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అభిమానులు వీరి బ్రేక‌ప్‌ను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

This post was last modified on February 2, 2022 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

1 hour ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

3 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

4 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago