Movie News

హాస్పిటల్‌లో ధనుష్ మాజీ భార్య

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె, స్టార్ హీరో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య‌ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. తాజాగా ఆమెకు క‌రోనా సోకింది. ప‌రిస్థితి కాస్త సీరియ‌స్‌గా ఉండ‌టం వ‌ల్ల ఐశ్వ‌ర్య వెంట‌నే హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐశ్వ‌ర్య‌ స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ..`జాగ్రత్తల‌న్నీ తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి,  టీకాలు వేయించుకుని సురక్షితంగా ఉండండి. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఐశ్వ‌ర్య త్వ‌ర‌గా క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించి ఆరోగ్య‌వంతంగా తిరిగిరావాల‌ని అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాక్షిస్తున్నారు.

కాగా, కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు.. ఇటీవ‌లె త‌మ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట‌.. చాలా అన్యోన్యంగా ఉంటూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. ఈ దంప‌తుల‌కు యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.

కానీ, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కొద్ది రోజుల క్రితం తాము విడాకులు తీసుకుంటున్నామ‌ని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు అధికారికంగా ప్ర‌క‌టించి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ స్టార్ క‌పుల్ విడిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అభిమానులు వీరి బ్రేక‌ప్‌ను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

This post was last modified on February 2, 2022 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago