సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తాజాగా ఆమెకు కరోనా సోకింది. పరిస్థితి కాస్త సీరియస్గా ఉండటం వల్ల ఐశ్వర్య వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించింది.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ..`జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి, టీకాలు వేయించుకుని సురక్షితంగా ఉండండి. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఐశ్వర్య త్వరగా కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యవంతంగా తిరిగిరావాలని అభిమానులు, పలువురు ప్రముఖులు ఆకాక్షిస్తున్నారు.
కాగా, కోలీవుడ్లో స్టార్ కపుల్గా గుర్తింపు పొందిన ధనుష్, ఐశ్వర్యలు.. ఇటీవలె తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసిన సంగతి తెలిసిందే. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట.. చాలా అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ దంపతులకు యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.
కానీ, ఎవరూ ఊహించని విధంగా కొద్ది రోజుల క్రితం తాము విడాకులు తీసుకుంటున్నామని ధనుష్, ఐశ్వర్యలు అధికారికంగా ప్రకటించి వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. ఈ స్టార్ కపుల్ విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అభిమానులు వీరి బ్రేకప్ను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on February 2, 2022 9:38 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…