బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్లో పెడుతూ మంచి జోష్ మీదున్నారు మెగాస్టార్. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబి మూవీకి కూడా ఒకే సమయంలో పని చేస్తూ యంగ్ హీరోలని మించి దూకుడు చూపిస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల సినిమాని కూడా లైన్లో పెట్టారు. సినిమాల లైనప్ అయితే సూపర్బ్గా ఉంది కానీ ప్రతి సినిమా విషయంలోనూ ఓ ప్రశ్నకి జవాబు దొరకడం కష్టమవుతోంది. హీరోయిన్ ఎవరు అనేదే ఆ ప్రశ్న.
సీనియర్ హీరో కావడంతో ఆయన ఇమేజ్కి, పర్సనాలిటీకి తగిన హీరోయిన్ని పట్టుకోవడం కాస్త కష్టమవుతోందనే చెప్పాలి. ఎక్కువ ఆప్షన్స్ ఉండటం లేదు. అందుకే ఆచార్య, భోళాశంకర్ చిత్రాల్లో కాజల్, తమన్నాలని రిపీట్ చేస్తున్నారు. ‘గాడ్ఫాదర్’లో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికైతే అనుష్క పేరు వినిపిస్తోంది. అలాగే వెంకీ కుడుముల చిత్రం విషయంలో త్రిష పేరు తెరమీదికొచ్చింది.
త్రిష కూడా గతంలో చిరంజీవితో నటించింది. సీనియర్ హీరోయిన్ల లిస్టులో ఉంది. అందుకే మరోసారి ఆమెని తీసుకుని ఉంటారనుకున్నారంతా. అయితే ఇప్పుడామె స్థానంలోకి మాళవికా మోహనన్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పేట’ మూవీతో ఫామ్లోకి వచ్చిన మాళవిక ‘మాస్టర్’ మూవీతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ధనుష్తో ‘మారన్’ మూవీ చేస్తోంది. ‘యుధ్ర’ అనే హిందీ యాక్షన్ ఎంటర్టైనర్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు తనని మెగా మూవీ కోసం లాక్ చేసినట్లు టాక్.
నిజానికి మాళవిక మెగాస్టార్కి మంచి జోడీనే. మంచి హైట్ ఉంటుంది. వయసు తక్కువే అయినా మెచ్యూర్డ్గా కనిపిస్తుంది. గ్లామరస్గానూ బాగుటుంది. ట్రెడిషనల్గా సూటవుతుంది. యంగ్ హీరోలకీ, సీనియర్ యాక్టర్లకి కూడా సెట్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి తనలో. రీసెంట్గా బాబి, చిరంజీవిల సినిమాకి శ్రుతీహాసన్ని తీసుకున్నారనే వార్తలు వచ్చినప్పుడు కొంతమంది ఇష్టపడలేదు. శ్రుతి పర్సనాలిటీకి, మెగాస్టార్ పర్సనాలిటీకి మ్యాచ్ అవదని వారి అభిప్రాయం. అయితే మాళవికని సెలెక్ట్ చేయడమనేది నిజమైతే మాత్రం మంచి చాయిస్ అనే చెప్పాలి.
This post was last modified on February 1, 2022 11:50 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…