బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్లో పెడుతూ మంచి జోష్ మీదున్నారు మెగాస్టార్. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబి మూవీకి కూడా ఒకే సమయంలో పని చేస్తూ యంగ్ హీరోలని మించి దూకుడు చూపిస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల సినిమాని కూడా లైన్లో పెట్టారు. సినిమాల లైనప్ అయితే సూపర్బ్గా ఉంది కానీ ప్రతి సినిమా విషయంలోనూ ఓ ప్రశ్నకి జవాబు దొరకడం కష్టమవుతోంది. హీరోయిన్ ఎవరు అనేదే ఆ ప్రశ్న.
సీనియర్ హీరో కావడంతో ఆయన ఇమేజ్కి, పర్సనాలిటీకి తగిన హీరోయిన్ని పట్టుకోవడం కాస్త కష్టమవుతోందనే చెప్పాలి. ఎక్కువ ఆప్షన్స్ ఉండటం లేదు. అందుకే ఆచార్య, భోళాశంకర్ చిత్రాల్లో కాజల్, తమన్నాలని రిపీట్ చేస్తున్నారు. ‘గాడ్ఫాదర్’లో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికైతే అనుష్క పేరు వినిపిస్తోంది. అలాగే వెంకీ కుడుముల చిత్రం విషయంలో త్రిష పేరు తెరమీదికొచ్చింది.
త్రిష కూడా గతంలో చిరంజీవితో నటించింది. సీనియర్ హీరోయిన్ల లిస్టులో ఉంది. అందుకే మరోసారి ఆమెని తీసుకుని ఉంటారనుకున్నారంతా. అయితే ఇప్పుడామె స్థానంలోకి మాళవికా మోహనన్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పేట’ మూవీతో ఫామ్లోకి వచ్చిన మాళవిక ‘మాస్టర్’ మూవీతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ధనుష్తో ‘మారన్’ మూవీ చేస్తోంది. ‘యుధ్ర’ అనే హిందీ యాక్షన్ ఎంటర్టైనర్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు తనని మెగా మూవీ కోసం లాక్ చేసినట్లు టాక్.
నిజానికి మాళవిక మెగాస్టార్కి మంచి జోడీనే. మంచి హైట్ ఉంటుంది. వయసు తక్కువే అయినా మెచ్యూర్డ్గా కనిపిస్తుంది. గ్లామరస్గానూ బాగుటుంది. ట్రెడిషనల్గా సూటవుతుంది. యంగ్ హీరోలకీ, సీనియర్ యాక్టర్లకి కూడా సెట్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి తనలో. రీసెంట్గా బాబి, చిరంజీవిల సినిమాకి శ్రుతీహాసన్ని తీసుకున్నారనే వార్తలు వచ్చినప్పుడు కొంతమంది ఇష్టపడలేదు. శ్రుతి పర్సనాలిటీకి, మెగాస్టార్ పర్సనాలిటీకి మ్యాచ్ అవదని వారి అభిప్రాయం. అయితే మాళవికని సెలెక్ట్ చేయడమనేది నిజమైతే మాత్రం మంచి చాయిస్ అనే చెప్పాలి.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…