Movie News

‘టైగర్ నాగేశ్వరావు’ వివాదం.. అసలేం జరిగిందంటే..?

‘టైగర్ నాగేశ్వరావు’ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాను రూపొందించనున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ కథ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ చేయాల్సింది. దర్శకుడు వంశీ స్క్రిప్ట్ పూర్తయ్యాక బెల్లంకొండకి వినిపించారు.

నిర్మాత అభిషేక్.. బెల్లంకొండకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 
అయితే ఈ యంగ్ హీరో మాత్రం వేరే సినిమా కమిట్మెంట్ ఉందని.. ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాను పక్కన పెట్టేశాడు. ఎంతకాలమవుతున్నా.. బెల్లంకొండ రెస్పాండ్ అవకపోవడంతో దర్శకనిర్మాతలు రవితేజకి కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. దీంతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ తను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వమని బెల్లంకొండని అడగ్గా.. ఇప్పుడు సినిమా చేద్దామని అన్నాడట బెల్లంకొండ. 

రవితేజతో సినిమా ఓకే చేసుకున్నామని నిర్మాత చెప్పగా.. బెల్లంకొండ శ్రీనివాస్ హర్ట్ అయ్యాడట. తనతో చేయాల్సిన సినిమా వేరే హీరోతో ఎలా చేస్తారని ప్రశ్నించాడట. అడ్వాన్స్ తిరిగిచ్చేదే లేదని తేల్చి చెప్పాడట బెల్లంకొండ శ్రీనివాస్. కావాలనే సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు బెల్లంకొండ.

అది చూసైనా.. రవితేజ తప్పుకుంటారని ఈ యంగ్ హీరో భావించాడు. కానీ అలా జరగలేదు. దీంతో ఇప్పుడు బెల్లంకొండ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ పెద్ద సెట్ ను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా కావడంతో అప్పటి రోడ్లు, ఇల్లు ఎలా ఉండేవో అలానే సెట్స్ వేస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారని సమాచారం. 

This post was last modified on January 30, 2022 2:18 pm

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

5 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

6 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

7 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

8 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

10 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

11 hours ago