అఖండతో ఎవ్వరూ ఊహించని భారీ విజయాన్నందుకున్నాడు బోయపాటి శ్రీను. దీనికి ముందు ఆయన్నుంచి వచ్చిన వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య కూడా వరుస డిజాస్టర్ల తర్వాత బోయపాటితో జట్టు కట్టడంతో మొదట్లో మరీ అంచనాలేమీ లేవు ఈ సినిమాపై. కానీ రిలీజ్ టైంకి హైప్ వచ్చింది. ఇక విడుదల తర్వాత అఖండ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇంత పెద్ద హిట్ కొట్టాక బోయపాటికి క్రేజీ ఆఫర్లు వస్తాయనే అంతా అనుకున్నారు. అల్లు అర్జున్ అని, చిరంజీవి అని బోయపాటి తర్వాతి సినిమా హీరో గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి. బన్నీతో సినిమా దాదాపు ఓకే అనే అన్నారు. కానీ ఏవో కారణాలతో ఆ సినిమా కార్యరూపం దాల్చేలా లేదు. మరోవైపు చిరంజీవికి చాలా కమిట్మెంట్లు ఉండటంతో బోయపాటికి ఓకే చెప్పినా సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు.
మిగతా పెద్ద హీరోల్లో ఎవరూ ఖాళీగా లేరు. ఈ పరిస్థితుల్లో బోయపాటి కాస్త రాజీ పడుతున్నట్లు సమాచారం. అతను యువ కథానాయకుడు రామ్తో జట్టు కట్టబోతున్నాడట. అతడి కోసం మంచి మాస్ కథ ఒకటి రాస్తున్నాడట. తక్కువ వ్యవధిలో ఈ సినిమా పూర్తి చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి ఓ నిర్మాత కూడా రెడీగా ఉన్నాడట.
ఇస్మార్ట్ శంకర్తో రామ్ రేంజ్ కొంచెం పెరిగింది. ప్రస్తుతం అతను లింగుస్వామితో వారియర్ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా బాగా ఆడితే అతడి రేంజ్ ఇంకా పెరగొచ్చు. ఈ ఆలోచనతోనే ఇప్పుడు తన స్థాయికి రామ్ తక్కువే అయినా సినిమా చేయడానికి బోయపాటి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తి చేశాక చిరంజీవి లేదా బాలయ్యతో అతను సినిమా చేసే అవకాశముంది.
This post was last modified on January 30, 2022 10:14 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…