అఖండతో ఎవ్వరూ ఊహించని భారీ విజయాన్నందుకున్నాడు బోయపాటి శ్రీను. దీనికి ముందు ఆయన్నుంచి వచ్చిన వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య కూడా వరుస డిజాస్టర్ల తర్వాత బోయపాటితో జట్టు కట్టడంతో మొదట్లో మరీ అంచనాలేమీ లేవు ఈ సినిమాపై. కానీ రిలీజ్ టైంకి హైప్ వచ్చింది. ఇక విడుదల తర్వాత అఖండ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇంత పెద్ద హిట్ కొట్టాక బోయపాటికి క్రేజీ ఆఫర్లు వస్తాయనే అంతా అనుకున్నారు. అల్లు అర్జున్ అని, చిరంజీవి అని బోయపాటి తర్వాతి సినిమా హీరో గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి. బన్నీతో సినిమా దాదాపు ఓకే అనే అన్నారు. కానీ ఏవో కారణాలతో ఆ సినిమా కార్యరూపం దాల్చేలా లేదు. మరోవైపు చిరంజీవికి చాలా కమిట్మెంట్లు ఉండటంతో బోయపాటికి ఓకే చెప్పినా సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు.
మిగతా పెద్ద హీరోల్లో ఎవరూ ఖాళీగా లేరు. ఈ పరిస్థితుల్లో బోయపాటి కాస్త రాజీ పడుతున్నట్లు సమాచారం. అతను యువ కథానాయకుడు రామ్తో జట్టు కట్టబోతున్నాడట. అతడి కోసం మంచి మాస్ కథ ఒకటి రాస్తున్నాడట. తక్కువ వ్యవధిలో ఈ సినిమా పూర్తి చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి ఓ నిర్మాత కూడా రెడీగా ఉన్నాడట.
ఇస్మార్ట్ శంకర్తో రామ్ రేంజ్ కొంచెం పెరిగింది. ప్రస్తుతం అతను లింగుస్వామితో వారియర్ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా బాగా ఆడితే అతడి రేంజ్ ఇంకా పెరగొచ్చు. ఈ ఆలోచనతోనే ఇప్పుడు తన స్థాయికి రామ్ తక్కువే అయినా సినిమా చేయడానికి బోయపాటి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తి చేశాక చిరంజీవి లేదా బాలయ్యతో అతను సినిమా చేసే అవకాశముంది.
This post was last modified on January 30, 2022 10:14 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…