Movie News

హరీష్ శంకర్ బాలీవుడ్ డెబ్యూ!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది దర్శకులు హిందీలో సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, వి.వి.వినాయక్ ఇలా చాలా మంది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఓ రీమేక్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. 

గత రెండేళ్లుగా హరీష్ శంకర్ నుంచి ఒక్క సినిమా కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. పవన్ కి ఉన్న వేరే కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఈ బ్రేక్ ను ఇతర స్క్రిప్ట్స్ కోసం వినియోగిస్తున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. దిల్ రాజుతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు. 

సి. చంద్ర మోహన్ అనే వ్యక్తి ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు హరీష్ శంకర్ ను బాలీవుడ్ కి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు దిల్ రాజు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. 

ఇప్పటికే హరీష్ శంకర్ బాలీవుడ్ కి తగ్గట్లుగా ‘డీజే’ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ హీరో బాలీవుడ్ రీమేక్ లో నటించబోతున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. మరి బాలీవుడ్ లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! 

Satya

Recent Posts

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

1 hour ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

4 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

8 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

11 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

11 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

13 hours ago