Movie News

మ‌హాన‌టితో సీతారామ‌రాజు నాటు స్టెప్పు

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట లిరిక‌ల్ వీడియో రిలీజ‌వ్వ‌డం ఆల‌స్యం.. అందులో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రినొక‌రు ప‌ట్టుకుని అదిరిపోయే సింక్‌లో చేసి హుక్ స్టెప్ సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. ఆ స్టెప్ ఎంత వైర‌ల్ అయిందో.. ఎన్ని ల‌క్ష‌ల మంది ఆ స్టెప్‌ను అనుక‌రిస్తూ వీడియోలు చేశారో లెక్క‌లేదు. దేశ‌విదేశాల్లో ఆ స్టెప్ పాపుల‌ర్ అయింది.

ఇప్పుడు ఒక ఊహించ‌ని జంట ఈ నాటు స్టెప్ వేసింది. అందులో ఒక‌రు ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చ‌ర‌ణే కాగా.. ఇంకొక‌రు అగ్ర క‌థానాయిక కీర్తి సురేష్ కావ‌డం విశేషం. కీర్తి ప్ర‌ధాన పాత్ర పోషించిన గుడ్ ల‌క్ స‌ఖి ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. నిజానికి చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి రావాల్సింది. కానీ ఆయ‌న అనుకోకుండా కరోనా బారిన ప‌డ‌గా.. ఆ స్థానంలో త‌న‌యుడు చ‌ర‌ణ్ వ‌చ్చాడు.

తాను త‌న తండ్రికి మెసెంజ‌ర్‌గా ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు చ‌ర‌ణ్ చెప్ప‌డం విశేషం. త‌న ప్ర‌సంగానికి ముందు చ‌ర‌ణ్ స్టేజ్ మీదికి రాగా.. కీర్తి త‌న‌తో క‌లిసి నాటు స్టెప్ వేయాల‌ని చ‌ర‌ణ్‌ను కోరింది. అందుకు మెగా ప‌వ‌ర్ స్టార్ అంగీక‌రించాడు. ఇద్ద‌రూ క‌లిసి కొన్ని క్ష‌ణాల పాటు నాటు నాటు పాట‌కు డ్యాన్స్ వేశాడు. ఇది అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది.

మ‌హాన‌టితో సీతారామ‌రాజు నాటు స్టెప్ అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. గుడ్ ల‌క్ స‌ఖి గురించి చ‌ర‌ణ్ మాట్లాడుతూ కీర్తి సురేష్‌, న‌గేష్ కుకునూర్, జ‌గ‌ప‌తిబాబు, దేవిశ్రీ ప్ర‌సాద్.. ఇలా ఇంత‌మంది పేరున్న వాళ్లు క‌లిసి ప‌ని చేస్తున్న సినిమా చిన్నది కాద‌ని.. ఇది పెద్ద రేంజ్ మూవీ అని అన్నాడు. ఈ చిత్రానికి సోలో రిలీజ్ డేట్ ద‌క్క‌డం ఆనంద‌దాయ‌క‌మ‌ని.. సినిమా క‌చ్చితంగా విజ‌య‌వంతం అవుతుంద‌ని చ‌ర‌ణ్ ధీమా వ్య‌క్తం చేశాడు.

This post was last modified on January 27, 2022 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

6 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

7 hours ago