దర్శనం మొగిలయ్య.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో తెలుగు వారిని బాగా ఆకర్షించిన పేర్లలో ఇదొకటి. ఈ పేరు కొన్ని నెలల ముందే వార్తల్లోకి వచ్చింది. కనుమరుగవుతున్న 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికించడంలో ఈ కళాకారుడిది ప్రత్యేక నైపుణ్యం. కానీ ఆ నైపుణ్యం జనాలకు చేరక.. ఆయనకు ఆర్థిక ఆసరా అందక ఏడాది ముందు వరకు దయనీయ స్థితిలో ఉన్నాడు మొగిలయ్య.
ఊరూరా తిరిగి కిన్నెరపై స్వరాలు పలికిస్తూ, పాటలు పాడుతూ ఏదో అలా జీవనం సాగిస్తూ వచ్చిన మొగిలయ్యకు భీమ్లా నాయక్ సినిమా వరంలా మారింది. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్కు గతంలో మొగిలయ్య పాటల నుంచి స్ఫూర్తి పొందడమే కాదు.. ఆయనతో ఈ పాట పల్లవిని పాడించాడు తమన్.
బేసిగ్గానే జానపద పాటలన్నీ, వాటిని పాడే కళాకారులన్నా ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించే పవన్ కళ్యాణ్.. మొగిలయ్యను పిలిచి సత్కరించడమే కాదు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందించాడు. పవన్ సినిమాలో పాట పాడటం, పవన్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడంతో మొగిలయ్య గురించి అందరికీ తెలిసింది. మొగిలయ్య ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. ఆయన గురించి జనాలకు తెలిసేలా చేయడంలో పవన్ పాత్ర కీలకం.
ఇన్నేళ్లలో ఎన్నడూ మొగిలయ్యను గుర్తించని ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆయనకు తగిన గౌరవాన్నిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కళల కేటగిరీలో ఆయన పేరును పద్మ పురస్కారానికి ప్రతిపాదిస్తే.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. కొన్ని నెలల వ్యవధిలో తన జీవితం ఇంతలా మారిపోతుందని, తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తాయని మొగిలయ్య ఊహించి ఉండకపోవచ్చు. ఈ మార్పులో పరోక్షంగా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 26, 2022 11:27 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…