దర్శనం మొగిలయ్య.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో తెలుగు వారిని బాగా ఆకర్షించిన పేర్లలో ఇదొకటి. ఈ పేరు కొన్ని నెలల ముందే వార్తల్లోకి వచ్చింది. కనుమరుగవుతున్న 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికించడంలో ఈ కళాకారుడిది ప్రత్యేక నైపుణ్యం. కానీ ఆ నైపుణ్యం జనాలకు చేరక.. ఆయనకు ఆర్థిక ఆసరా అందక ఏడాది ముందు వరకు దయనీయ స్థితిలో ఉన్నాడు మొగిలయ్య.
ఊరూరా తిరిగి కిన్నెరపై స్వరాలు పలికిస్తూ, పాటలు పాడుతూ ఏదో అలా జీవనం సాగిస్తూ వచ్చిన మొగిలయ్యకు భీమ్లా నాయక్ సినిమా వరంలా మారింది. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్కు గతంలో మొగిలయ్య పాటల నుంచి స్ఫూర్తి పొందడమే కాదు.. ఆయనతో ఈ పాట పల్లవిని పాడించాడు తమన్.
బేసిగ్గానే జానపద పాటలన్నీ, వాటిని పాడే కళాకారులన్నా ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించే పవన్ కళ్యాణ్.. మొగిలయ్యను పిలిచి సత్కరించడమే కాదు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందించాడు. పవన్ సినిమాలో పాట పాడటం, పవన్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడంతో మొగిలయ్య గురించి అందరికీ తెలిసింది. మొగిలయ్య ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. ఆయన గురించి జనాలకు తెలిసేలా చేయడంలో పవన్ పాత్ర కీలకం.
ఇన్నేళ్లలో ఎన్నడూ మొగిలయ్యను గుర్తించని ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆయనకు తగిన గౌరవాన్నిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కళల కేటగిరీలో ఆయన పేరును పద్మ పురస్కారానికి ప్రతిపాదిస్తే.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. కొన్ని నెలల వ్యవధిలో తన జీవితం ఇంతలా మారిపోతుందని, తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తాయని మొగిలయ్య ఊహించి ఉండకపోవచ్చు. ఈ మార్పులో పరోక్షంగా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 26, 2022 11:27 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…